Tollywood : టాలీవుడ్ పై ఎలక్షన్ పిడుగు… ఇంత నష్టం వస్తుందా?

తాజాగా రిలీజ్ అయిన ఎన్నికల షెడ్యూల్ కారణంగా టాలీవుడ్ నెత్తిపై పిడుగు పడ్డట్టుగా అయ్యింది. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలవు అన్నట్టుగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో పలు సినిమాలు పోస్ట్ పోనే కావడం తప్పేలా లేదు. ఏప్రిల్ లోనే అంతా పూర్తయిపోతుంది అని ఇప్పటిదాకా హాయిగా ఊపిరి పీల్చుకున్న పలువురు నిర్మాతలకు ఇప్పుడు కంటిమీద కునుకు కరువైంది. ఎలక్షన్స్ మరో నెల రోజులు ఆలస్యం కావడంతో ఇప్పటికే షెడ్యూల్ చేసిన కొన్ని సినిమాలు వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ఎఫెక్ట్ ఉంటుందనే కారణంతోనే ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు కాసుల వర్షం కురిపించే సమ్మర్ సీజన్ ను వదిలేసుకున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంటుంది. ఇది నిర్మాతలకు మరో తలనొప్పి తెచ్చిపెట్టింది.

మొదట బలయ్యేది ఎవరంటే….
ఎన్నికల షెడ్యూల్ కారణంగా పలు పాన్ వరల్డ్ సినిమాలకు ఇబ్బందులు మొదలయ్యాయి. మే 13న ఏపీ, తెలంగాణలో పోలింగ్ ఉందన్న విషయం తెలిసిందే. నిజానికి ఇది ఎలక్షన్ ఫీవర్ పీక్స్ లో ఉండే సమయం అన్నమాట. అప్పుడు ప్రేక్షకులు ఎంత పెద్ద సినిమా వచ్చినా పక్కన పడేస్తారు. ఎందుకంటే అందరి దృష్టి ఎలక్షన్స్ పైనే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో రిలీజ్ అయ్యే సినిమాలేవైనా పోస్ట్ పోన్ చేయక తప్పదు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించేసింది. ఈ 20 రోజుల పాటు పొలిటికల్ హంగామా ఉంటుంది. కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు సినిమాల్ని తీసుకురాకపోవడమే మంచిది అనేది టాలీవుడ్ మేకర్స్ ఆలోచన. కానీ ఈ ఎఫెక్ట్ ముందుగా పడేది పాన్ వరల్డ్ మూవీ “కల్కి” పైనే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మే 9 థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. పలుమార్లు ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని రూమర్లు వచ్చినప్పటికీ, నిర్మాతలు ఎప్పటికప్పుడు అనౌన్స్ చేసిన తేదీనే మూవీని థియేటర్లలోకి తీసుకొస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాకుండా అనుకున్న విధంగా మే 9న మూవీని రిలీజ్ చేయడానికి రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తూ వచ్చారు. కానీ తీరా చూస్తే ఎన్నికల షెడ్యూల్ “కల్కి”పై తీవ్రంగా ఎఫెక్ట్ చూపించేలా కనిపిస్తోంది. కల్కి మూవీ మే 9న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత దాదాపు 20 రోజులపాటు ఎలక్షన్స్ సందడి నెలకొంటుంది. కాబట్టి రిలీజ్ చేసినా ఉపయోగం ఉండదు. మరి “కల్కి” మూవీ పోస్ట్ పోన్ అవుతుందా? అంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.

ఈ ఒక్క సినిమానే సేఫ్…
ఇక ఎలక్షన్స్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఫ్యామిలీ స్టార్ మాత్రమే బయటపడతాడు. విజయ్ దేవరకొండ హీరోగా, పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఎలక్షన్స్ వచ్చేలోపే అంటే ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానుంది. కాబట్టి ఈ మూవీపై ఎలక్షన్స్ ఎఫెక్ట్ లేనట్టే. కానీ ఆ తర్వాత వచ్చే విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” పరిస్థితి కూడా డౌట్ గానే ఉంటుంది. మే 13న పోలింగ్ అయితే, మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే కౌంటింగ్ ఉంటుంది. పోనీ ఆ తర్వాత రిలీజ్ చేసుకుందాం అంటే అప్పుడు ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంటుంది కాబట్టి సాధ్యం కాదు. మొత్తానికి ఎలక్షన్స్ వల్ల టాలీవుడ్ నిర్మాతల ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు