SSMB 29 : ట్రిపుల్ ఆర్ సెంటిమెంట్ ఫాలో అవుతున్న జక్కన్న… షూటింగ్ విషయంలో

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో SSMB 29 అనే మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సెంటిమెంటును ఫాలో అవుతున్నాడు అనేది లేటెస్ట్ టాక్. మరి ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

SSMB 29కి ట్రిపుల్ ఆర్ సెంటిమెంట్…
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ బాహుబలి ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తరువాత ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు ముద్దాడేలా చేశారు. దీంతో తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచారు జక్కన్న. అయితే రాజమౌళి సినిమా అనగానే విజువల్ వండర్ ను ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆయన రూపొందించే సినిమాలన్నీ హై టెక్నికల్ వాల్యూస్ తో విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంటాయి. ఆయనకు తగ్గట్టుగానే రాజమౌళి సినిమాల సెట్స్ కోసం నిర్మాతలు డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ చాలావరకు సినిమాకు సంబంధించిన ప్రధాన సన్నివేశాలు అన్నింటినీ ఆ సెట్లలోనే తెరకెక్కిస్తారు జక్కన్న.

అలాగే రామోజీ ఫిలిం సిటీలోనే బాహుబలికి సంబంధించిన షూటింగ్ మొత్తం జరిగింది. కానీ ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఆయన గచ్చిబౌలిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీని సెలెక్ట్ చేసుకున్నారు. దాదాపు 100 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీలో కొంత భాగాన్ని జక్కన్న లీజుకు తీసుకున్నాడు. అక్కడే ట్రిపుల్ ఆర్ కు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా మహేష్ బాబుతో తీయబోయే సినిమాకు కూడా రాజమౌళి అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. SSMB 29 షూటింగ్ కోసం మరోసారి అల్యూమినియం ఫ్యాక్టరీనే ఆయన సెలెక్ట్ చేసుకోవడం విశేషం. ఈ మూవీ ఫారెస్ట్ అడ్వెంచరస్ గా తెరకెక్కుతుంది కాబట్టి ఇదే పర్ఫెక్ట్ అనుకుంటున్నారట. అంతేకాకుండా ట్రిపుల్ ఆర్ కు మించి SSMB 29 హిట్ కొట్టాలనే ఆలోచనతోనే మళ్ళీ అల్యూమినియం ఫ్యాక్టరీని షూటింగ్ కోసం సెంటిమెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది.

- Advertisement -

SSMB 29 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే?
ఇక గత ఏడాది డిసెంబర్లో SSMB 29 మూవీ గురించి మాట్లాడారు జక్కన్న. 6 నెలల పాటు ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతాయని అప్పుడే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికి కూడా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది ఈ ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ మూవీ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ ను లో నిర్మించే పనిలో పడ్డారట మేకర్స్. మే నెలాఖరు లోగా సెట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. కాబట్టి జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మూవీని ఉగాది సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ అనౌన్స్మెంట్ కోసం రాజమౌళి ఫ్యాన్స్ తో పాటు మహేష్ అభిమానులు కూడా కళ్ళలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అదే రోజు మూవీ టైటిల్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమోనని ఆశగా వెయిట్ చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు