Renu Desai : ఆ సినిమా ఖచ్చితంగా చూడమంటూ రేణు దేశాయ్ పోస్ట్!

Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు దశాబ్దాల కింద పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా తో పరిచయమైన ఈమె ఒక్క సినిమాకే మంచి క్రేజ్ ని సంపాదించింది. అప్ప్పుడే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల మధ్య నిజమైన ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జానీ సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఇక రేణు దేశాయ్ ఆ రెండు సినిమాలలోనే నటించినా తెలుగు ప్రేక్షకులకు చాలా చేరువైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పెళ్లి చేసుకున్న ఈమె కొన్నేళ్ల పాటు ఫ్యామిలీకి పరిమితమైంది. వీరికి ఇద్దరు పిల్లలని తెలిసిందే. ఇక కొడుకు అకిరా నందన్ ఫిల్మ్ ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయింది. అయితే వీరు విడిపోయినా స్నేహపూర్వకంగానే పిల్లల కోసం కలుస్తూనే ఉంటారు. ఆ మధ్య అకిరా నందన్ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఆ సందర్బంగా వీళ్ళు కలిసిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది రేణు. ఇదిలా ఉండగా తాజాగా ఓ బాలీవుడ్ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది రేణు దేశాయ్.

ఖచ్చితంగా ఈ సినిమా చూడమని పోస్ట్!

ప్రస్తుతం పిల్లలతో కలిసి ఉంటున్న రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ బాలీవుడ్ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసారు రేణు దేశాయ్. బాలీవుడ్ నటి యామి గౌతమ్, ప్రియమణి, రాజ్ అర్జున్ లు ప్రధాన పాత్రల్లో, ఆదిత్య సుహస్ జంభ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం “ఆర్టికల్ 370”. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ మధ్యే డిజిటల్ రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. తాజాగా ఈ సినిమాను చూసిన రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదిక గా ఆర్టికల్ 370 మూవీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వాస్తవికత కోసం చూడాలి..

తాజాగా రేణు దేశాయి ఆర్టికల్ 370 మూవీ గురించి పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో ఇలా ఉంది. ఇప్పుడే ఈ చిత్రాన్ని చూసాను. దీన్ని చిత్రీకరించిన అద్భుతమైన విధానం మరియు మన దేశంలోని అద్భుతమైన నటులు మరియు వాస్తవికత కోసం ప్రతి ఒక్కరూ దీన్ని ఒకసారి చూడాలి అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది. 2019 లో ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామా దాడి జరిగిన తరువాత జమ్ము కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను కల్పించే విధంగా ఆర్టికల్ 370 ను రద్దు చేసే అంశం పై సినిమా తెరకెక్కింది. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రం లో స్కంద్ సంజీవ్ ఠాకూర్, వైభవ్ తత్వవాడి, అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్ లు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా రేణు దేశాయ్ లాస్ట్ ఇయర్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి పాత్రలో నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు