Guntur Kaaram : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నో పర్మిషన్… కొత్త వేదిక ఎక్కడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ కు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే “గుంటూరు కారం” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అడ్డంకులు ఏర్పడినట్టుగా తెలుస్తోంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతోంది? అసలేమైంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ జనవరి 12న భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాలన్నింటిలో “గుంటూరు కారం” మూవీ గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ సినీ ప్రియులు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా, ఈ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ల గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. “గుంటూరు” కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో, జనవరి 6న జరగబోతోందని ఇప్పటికే నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గుంటూరు కారం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి పర్మిషన్ దొరకలేదట మేకర్స్ కి. దీంతో ఈవెంట్ కోసం కొత్త వేదికను వెతికే వేటలో పడ్డారట “గుంటూరు కారం” టీం. ఈ మూవీకి ఉన్న అంచనాలను బట్టి చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. మరి కొత్త వేదికను ఎక్కడ నిర్ణయిస్తారో చూడాలి. ఇక ఈ విషయం తెలియడంతో ఇప్పటిదాకా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని భావిస్తున్న మహేష్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

నిజానికి యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ ను సెంటిమెంట్ గా భావించారు “గుంటూరు కారం” టీంతో పాటు మహేష్ అభిమానులు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురము’లో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా అక్కడే నిర్వహించారు. ఆ మూవీ ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే “గుంటూరు కారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడా గ్రౌండ్ లో అనగానే ఎగిరి గంతేసినంత పని చేశారు మహేష్ ఫ్యాన్స్. కానీ పర్మిషన్ దొరకకపోవడంతో వాళ్ళ ఆశ నిరాశ అయింది. కాగా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ మూవీ ట్రైలర్ ను కూడా లాంచ్ చేయనున్నారు. మహేష్. -త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ మూడవ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. “గుంటూరు కారం” నిర్మాత నాగ వంశీ చేస్తున్న కామెంట్స్, సినిమాపై బయటకు వస్తున్న రోజుకొక రూమర్ మరింత హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్కువ శాతం థియేటర్లలో “గుంటూరు కారం” మూవీనే రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు