OTT Movies : ఈరోజు ఓటీటీలోకి రెండు సినిమాలు…. ఒకటి సైకో థ్రిల్లర్, మరొకటి క్రైమ్ థ్రిల్లర్

OTT Movies : ప్రతి శుక్రవారం ఓటిటిలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా వీకెండ్ రాకముందే ఈరోజు ఒకే ఓటీటీలో ఒకేసారి రెండు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అది కూడా రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు కావడం విశేషం. మరి ఆ రెండు సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అసలు ఆ సినిమాలేంటి అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే…

టాప్ ఓటిటీ ప్లాట్ఫామ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్. ఈ మూడింట్లో అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. కానీ కంప్లీట్ గా తెలుగు కంటెంట్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేసే ఓటీటీ సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు భాషలో సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేసే ఓటిటి సంస్థలు రెండే రెండు ఉన్నాయి. ఒకటి ఆహా కాగా, ఇంకొకటి ఈ టీవీ విన్. ఈ రెండు ఓటిటి ప్లాట్ఫామ్స్ లో మాత్రమే ఎప్పటికప్పుడు ఎక్కువగా తెలుగు కంటెంట్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పటిదాకా ఆహాలో మాత్రమే దొరికే తెలుగు సినిమాలు ఇటీవల కాలంలో ఈటీవీ విన్ లో కూడా పెరిగాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు ఈ రెండు ఓటిల్లో ఒకటైన ఈటీవీ విన్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మే 9న 2 జానర్లకు సంబంధించిన రెండు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి స్ట్రెయిట్ తెలుగు మూవీ కాగా, మరొకటి తమిళ డబ్బింగ్ మూవీ.

- Advertisement -

ముందుగా తెలుగు స్ట్రెయిట్ సినిమా విషయానికి వస్తే.. ఇదొక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో వరుణ్ సందేశ్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రం చూడరా అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీకి ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. ఇందులో శీతల్ భట్ హీరోయిన్ గా నటించింది. వీరితో పాటే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తనికెళ్ల భరణి, రవి బాబు, రాజా రవీంద్ర, అన్నపూర్ణ, రచ్చ రవి, శివాజీ రాజా వంటి నటీనటులు కీలకపాత్రలో పోషించారు. కాగా  ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటిలోకి వచ్చేసింది. మూవీ స్టోరీ విషయానికి వస్తే పల్లెటూరు నుంచి సినిమాల మీద ఆశతో హైదరాబాద్ కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు సంబంధం లేని ఓ దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే స్టోరీ.

ఇక రెండవ మూవీ విషయానికి వస్తే.. ఇదొక సైకోథ్రిల్లర్ మూవీ. పార్ధు అనే టైటిల్ తో తెలుగులోకి వచ్చిన ఈ మూవీ తమిళ సినిమా ఓమై సెన్నయ్ అనే మూవీకి డబ్బింగ్ వర్షన్. 2021లో థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్ అందుకున్న ఈ మూవీకి మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఏకలవ్యంన్ దర్శకత్వం వహించారు. ఈ సైకో థ్రిల్లర్ మూవీ కూడా ఈటీవీ విన్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు