Soundarya: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా.?

దివంగత నటీమణి అలనాటి అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు దక్కించుకున్న ఈమె ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించారు. ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఇప్పటికీ సౌందర్య అభిమానులు ఉన్నారనడం లో సందేహం లేదు. అంతలా తన నటనతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి దక్షిణాదినే కాదు ఉత్తరాదిని కూడా ఒక ఊపు ఊపిన సౌందర్య.. 2000స్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

కెరియర్ పీలో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితులు రఘుని వివాహం చేసుకున్న ఈమె.. వైవాహిక జీవితంలో మాత్రం ఆ ఆనందాన్ని అనుభవించే అదృష్టాన్ని పొందలేక పోయింది. 2004 లోనే ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఇక సౌందర్య మరణించినప్పుడు.. వీరి వివాహం జరిగి సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. సౌందర్య మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు నిర్వహించారు రఘు.. అంతే కాదు సౌందర్య పేరు మీద స్కూల్ కూడా నడుపుతున్నారు.. ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.. ఇలాంటి రఘు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.

ప్రస్తుతం రఘు గోవాకి చెందిన డాక్టర్ అర్పితను రెండవ వివాహం చేసుకొని.. ప్రస్తుతం విదేశాలలో సెటిల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సౌందర్య విషయానికి వస్తే.. 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది. హెలికాప్టర్ ఎక్కే ముందు తన వదినను రెండు విషయాలు అడిగారట. కాటన్ చీర అలాగే కుంకుమ కావాలని అడిగిన సౌందర్య అవి తీసుకోకుండానే స్వర్గస్తురాలయింది అంటూ తన అన్నయ్య భార్య కన్నీటిపర్యంతమయింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటిగా మంచి పేరు దక్కించుకున్న ఈమె ఇప్పుడు మన మధ్య లేకపోవడం విషాదకరమని చెప్పాలి. ఇకపోతే దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా నటించిన ఈమె తెలుగులోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇక చివరిగా ఆప్తమిత్ర అనే సినిమాలో నటించింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు