Tillu Square : నిర్మాతపై అనుపమ సీరియస్… ఇదే గొడవ

Tillu Square : డీజే టిల్లు మూవీతో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తెచ్చిన పాపులారిటీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సిద్దు ఇప్పుడు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్, నిర్మాత నాగ వంశీకి మధ్య గొడవ జరిగిందని విషయం బయటకు వచ్చింది. మరి ఇంతకీ అనుపమ ఏ విషయంలో నిర్మాత నాగ వంశీ పై సీరియస్ అయ్యింది? అనే వివరాల్లోకి వెళ్తే…

నాగ వంశీపై అను సీరియస్…

టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ముఖ్యంగా ప్యాచ్ వర్క్ విషయంలో అనుపమకు కోపం వచ్చినట్టుగా తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసే 15 రోజుల ముందు వరకు ప్యాచ్ వర్క్ షూటింగ్ చేశారట చిత్ర బృందం. ఆ సమయంలో ఏకంగా నాలుగు రోజులపాటు షూటింగ్ ఉందని నాగ వంశీ అనుపమకు కాల్ చేసి చెప్పాడట. అయితే తను బిజీగా ఉండడం వల్ల ఉన్నఫలంగా నాలుగు రోజుల కాల్షిట్లు కావాలంటే అనుపమకి అడ్జస్ట్ చేయడం చాలా కష్టమైందట. అందుకే కాల్ షీట్లు కావాలని తనకు ఫోన్ చేసిన నాగ వంశీపై అనుపమ సీరియస్ అయినట్టు ఇన్సైడ్ టాక్. అయితే నాగ వంశీ ఎంత అగ్రెసివ్ గా ఉంటారో అందరికీ తెలుసు. మరి వీరిద్దరి మధ్య జరిగిన గొడవకు ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ గొడవ ఎలా సద్దుమణిగింది? అనే విషయం మాత్రం తెలియరాలేదు. కానీ మరికొన్ని గంటల్లో టిల్లు స్క్వేర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ వార్త మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది.

పాపం అను… ఇంత కష్టపడిందా?

ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో బోల్డ్ సీన్లలో రెచ్చిపోయి మరీ నటించింది. దీంతో ఆమెను ఊహించని విధంగా చూసిన కొంత మంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో టిల్లు స్క్వేర్ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ కి సంబంధించి తనకు ఎదురైన కష్టాల గురించి అనుపమ బయటపెట్టింది. తను ఇన్నాళ్లు గర్ల్ నెక్స్ట్ డోర్ గానే ఉన్నానని, కానీ ఈ మూవీలో వేసుకున్న కాస్ట్యూమ్స్ తాను రియల్ లైఫ్ లో కూడా వేసుకోలేదని, ఈ మూవీ చేసిన తర్వాతే హాట్ గా కనిపించడం అనేది ఎంత కష్టమో తనకు అర్థమైందని చెప్పుకొచ్చింది. ఒకసారి శారీ కట్టుకున్నప్పుడు చేయి మొత్తం గీరుకుపోయిందని తాను పడ్డ కష్టాన్ని వెల్లడించింది. ఇక స్క్రీన్ మీద చూసి రొమాంటిక్ సీన్స్ చేయడం ఈజీ అనుకుంటారని, కానీ వందలమంది క్రూ ముందు హీరోతో రొమాన్స్ చేయడం, అదికూడా నేచురల్ గా చేయడం అంటే చాలా కష్టమని చెప్పుకు వచ్చింది. సినిమాలోని మిగిలిన సన్నివేశాల కంటే ఇంటిమేట్ సీన్స్ చేయడానికే తను ఇబ్బంది పడ్డానని వెల్లడించింది. కానీ మొత్తానికి టిల్లు స్క్వేర్ మూవీలో లిల్లీ పాత్రతో అనుపమ సంచలనమే క్రియేట్ చేసింది. మరి తాను పడ్డ కష్టానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మార్చ్ 29న తేలనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు