Krishna Mukherjee..సినీ ఇండస్ట్రీలో వుండే క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు నోరు విప్పారు. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ హీరోయిన్ల పైనే కాకుండా బుల్లితెర నటీమణుల పైన కూడా జరుగుతుందని అప్పుడప్పుడు చాలామంది తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ప్రముఖ టీవీ సీరియల్ యాక్టర్ మాత్రం తనను మేకప్ రూమ్ లో బంధించి మరీ వేధించారంటూ పలు సంచలన ఆరోపణల చేస్తోంది. మరి ఆ నటి ఎవరు? అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
వారి వల్లే అనారోగ్యంతో బాధపడుతున్నా..
హిందీలో మే హై మెహబ్బతే.. అనే ధారావాహిక ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి కృష్ణ ముఖర్జీ. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు విషయాలను బయటపెట్టింది. రోజూ వారీ ప్రసారమయ్యేటటువంటి సీరియల్ ” శుభ్ షగున్” షో నిర్మాతలపైన కృష్ణ ముఖర్జీ సంచలన ఆరోపణలు చేసింది. ఆ విషయాలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్స్టాగ్రామ్ లో ఇలా తెలియజేస్తూ.. ఈ సీరియల్ నిర్మాత తనను వేధిస్తున్నాడు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసింది.. ఈ కారణంగానే ఈమె గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నానని కూడా తెలియజేసింది.
బాధ భరించలేక బయట పెడుతున్నా..
వారు చేసే పనుల వల్ల తనలో నిరాశ , ఆందోళన మొదలయ్యాయని.. తన భావాలను వ్యక్తపరిచే ధైర్యం కూడా తనకు ఎప్పుడు ఇవ్వలేదని.. అందుకే ఇకపై దీనిని తనలో ఉంచకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నానని.. అందుకే ఇలా తెలియజేశానని తెలుపుతోంది కృష్ణ ముఖర్జీ. తన జీవితంలో తాను చాలా కష్టమైన సమయాన్ని కూడా అనుభవించానని ఒంటరిగా ఉన్నప్పుడు చాలా కలత చెందానని తెలుపుతోంది. కృష్ణ ముఖర్జీ మాట్లాడుతూ.. దంగల్ టీవీ కోసం చివరిగా ఒక షోనీ శుభ్ షగున్ చేశానని.. ఇదంతా అప్పుడే ప్రారంభమయ్యింది.. నా జీవితంలో ఇదొక చెత్త నిర్ణయం అని కూడా వెల్లడించింది.
బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు..
ప్రొడక్షన్ హౌస్ తోపాటు.. నిర్మాత కుందన్ సింగ్ తనను ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టారని.. తన ఆరోగ్యం బాగాలేక పోయిన సమయంలో కూడా తనను మేకప్ రూమ్ లో బంధించారు.. అది కూడా తను బట్టలు మార్చుకుంటున్న సమయంలో.. ఆ రూం తలుపు ప్రతిసారి కొట్టేవారని.. ఎన్నోసార్లు డోర్ పగలగొడతారేమో అనే భయం కూడా వేసిందని …ప్రశ్నిస్తే తనకు డబ్బులు కూడా ఇచ్చేవారు కాదని ..అందుకే షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఇలాంటి విషయాలకు భయపడే ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్టులు కూడా చేయలేదు అని.. ఐదు నెలలుగా తనకు జీతం కూడా ఇవ్వలేదని నటి ఆవేదన చెందుతోంది. ఈ విషయం పైన అటు ప్రొడక్షన్ హౌస్ దంగల్ ఛానల్ వరకు వెళ్లాను కానీ ఎటువంటి స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయవలసి వచ్చింది అంటూ తెలిపింది కృష్ణ ముఖర్జీ. ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఏదేమైనా ఒక నీటిని ఈ విధంగా హింసించడం చాలా బాధాకరమని తెలుస్తోంది.
View this post on Instagram