Ramayanam Leaks : నితీష్ కు ఊహించని షాక్… సెట్స్ నుంచి రణబీర్, సాయి పల్లవి పిక్స్ లీక్

Ramayanam Leaks : ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో హిందీ రామాయణం కూడా ఒకటి. దంగల్ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యష్ రావణాసురుడు నటించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ కు షాక్ ఇచ్చేలా ఈ మూవీ నుంచి సీతారాముల లుక్స్ లీక్ అవ్వడం గమనార్హం.

సెట్స్ నుంచి రణబీర్, సాయి పల్లవిల పిక్స్ లీక్..

ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం షూటింగ్ సెట్ నుంచి రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ముస్తాబైన ఫోటోలు లీక్ అవ్వగా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో సాయి పల్లవి సిగ్గు పడుతూ సీత లుక్ లో అందంగా ఉండగా, మరో ఫోటోలో రాముడిగా రణబీర్, సాయి పల్లవి సెట్ లోకి అడుగుపెడుతున్న సీన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఆ పిక్స్ ను చూస్తే వీళ్లిద్దరిపై సాంగ్ రూపొందిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది.

క్యూరియాసిటీని చల్లారుస్తున్న లీక్స్

నిజానికి ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఉంది. తొలిసారిగా రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తుండడంతో, వీళ్ళిద్దరిని తెరపై రాముడు సీతా పాత్రలో చూడడానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా లీకైన ఈ ఫోటోలు వల్ల వాళ్ళ నిరీక్షణపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఇలాగే కంటిన్యూ అయితే సినిమాపై అంచనాలు తగ్గిపోవడం ఖాయం.

- Advertisement -

ఇదే లీకైన సీన్..

ఆ ఫోటోల్లో రణబీర్ కపూర్ ఊదా, మెరూన్ రంగులో ఉన్న దుస్తువులలో, మెడలో బంగారు హారంతో, పొడవైన జుట్టు చెవి పోగులు పెట్టుకుని కనిపించాడు. సాయి పల్లవి కూడా అదే కాంట్రాస్ట్ దుస్తువుల్లో కనిపిస్తోంది. వీరిద్దరి చేతులకు బంగారు కంకణాలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే సీతారాముడి పెళ్లి తర్వాత జరిగే సీన్ అనిపిస్తోంది.

మేకర్స్ కు తలనొప్పిగా మారిన లీక్స్

వాస్తవానికి ఇన్నాళ్లు బాలీవుడ్ రామాయణం సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది అని చెప్తూ వచ్చిన మేకర్స్ సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కానీ తాజా పరిణామాలు సినిమాపై ఆసక్తిని తగ్గించేలా ఉన్నాయి. ఈ మూవీ నుంచి మెయిన్ లీడ్స్ కు సంబంధించిన లుక్స్ అన్నీ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఇక రణబీర్, సాయి పల్లవి ఫోటోలు బయటకు రాకుండా నితీష్ తివారి గట్టి చర్యలు తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆయన చర్యలు ఏమాత్రం ఫలించలేదని తాజాగా లీకైన పిక్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ లీక్స్ విషయంలో మేకర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

కాగా ఈ బాలీవుడ్ రామాయణాన్ని నిర్మిస్తున్న వాళ్లలో కన్నడ స్టార్ యష్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ తో కలిసి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు