Chiranjeevi : రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మవిభూషణ్’ అందుకున్న చిరు..!

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి 2024 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత రెండో పురస్కారమైన “పద్మవిభూషణ్” లభించిన సంగతి తెలిసిందే. తాజాగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అత్యున్నత పౌర పురస్కారాల అవార్డుల ప్ర‌దాన‌ వేడుక ఈరోజు (మే 9) ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగింది.
ఈ వేడుకలో ప‌ద్మ‌విభూష‌ణ్ గ్ర‌హీత‌, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రాంచరణ్, అలాగే చిరంజీవి సతీమణి సురేఖ, చరణ్ భార్య ఉపాసన సహా హాజరయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అవార్డు అందుకునే స‌మ‌యంలో చ‌ర‌ణ్- ఉపాస‌న దంప‌తులు ఈ సంద‌ర్భాన్ని ఎంతో ఆనందంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం తాజాగా రిలీజైన‌ వీడియోలో క‌నిపిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తో పాటు, తమిళ నటి వైజయంతి మాల సహా పలువురు కళాకారులకు పద్మ పురస్కారాలతో సత్కరించడం జరిగింది.

పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి..

ఇక పద్మ పురస్కారాలతో చిరంజీవితో పాటు తమిళ నటి వైజయంతి మాల కూడా ఈ అవార్డును అందుకోవ‌డం విశేషం. ఈ ఏడాది జనవరిలో అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించగా, నేడు పుర‌స్కారాల‌ను అందుకున్నారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుక కోసం ఎంతో హుందాగా సూట్ లో జెంటిల్ మెన్ లా ముస్తాబై వ‌చ్చారు. భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీజీ, అమిత్ షా స‌హా ఎంద‌రో దిగ్గ‌జాలు కొలువు దీరి ఉండ‌గా వారంద‌రికీ గౌర‌వ‌పూర్వ‌కంగా న‌మ‌స్క‌రించిన మెగాస్టార్ వేదిక వ‌ద్ద‌కు హుందాగా న‌డుచుకుంటూ వెళ్లారు. అక్క‌డ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల‌ మీదుగా పుర‌స్కారాన్ని అందుకున్నారు. దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైర‌ల్ అవుతున్నాయి. ఆ వీడియోలో చిరంజీవి బ్లాక్ టీ షర్ట్, బ్లూ డెనిమ్ ధరించగా, రామ్ చరణ్ బ్లూ డెనిమ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించాడు.

చిరంజీవి, కళా, ప్రజా సేవలకు గుర్తుగా పద్మ..

ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర కళామతల్లికి సేవలందిస్తున్నారు. దేశంలో పలు భాషల్లో చిరంజీవి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమపై చిరంజీవి ప్రభావం అసాధార‌ణ‌మైన‌ది. 150 చిత్రాలకు పైగా సినిమాల్లో న‌టించిన చిరంజీవి సుప్రీంహీరోగా, మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో కొలువై ఉన్నారు. సినీ ఇండస్ట్రీ లో తన స్వయంకృషి తో ఎదిగి అంకితభావం గొప్ప‌ నిబద్ధత గల చిరంజీవిని సౌత్ ఇండస్ట్రీలో మెగా స్టార్ ని చేసాయి. న‌ట‌న‌లో శిఖ‌రం ఎత్తుకు ఎదిగిన చిరంజీవి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ‘ఇండస్ట్రీ పెద్ద’ పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇక ఇటు ప్రజాసేవలోనూ చిరంజీవి తనదైన పద్దతిలో ప్రజాసేవ చేసారు. ఆప‌ద‌లో నేను సైతం అంటూ 90ల కాలంలోనే ప్రజలకు సేవ చేసారు. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవ‌ల‌తో పాటు, ఎంద‌రికో తెలియ‌ని గుప్త దానాల‌ను చిరంజీవి చేసారు. ఇక క‌రోనా స‌మ‌యంలో 60 కోట్లు పైగా సొంత డ‌బ్బును ఖర్చు చేసి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు స‌హా ఎంద‌రికో ప్రాణ‌దానం కోసం అవ‌స‌ర‌మైన బెడ్లు ఏర్పాటు చేసారు. ఇప్పటికి ఎవరికీ కష్టం వచ్చినా సినీ ఇండస్ట్రీ నుండి ముందుండే వారు చిరంజీవి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు