Padma Awards : చరిత్రలో ఇదే మొదటి సారి – చిరంజీవి

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవికి 2024 లో భారత ప్రభుత్వం దేశంలోనే రెండవ అత్యుత్తమ అవార్డు అయిన పద్మ విభూషణ్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్బంగా
ఈ అనౌన్స్ మెంట్ చేయగా, ప్రతి దేశంలోని పలువురు సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు విషెస్ తెలియచేయడం జరిగింది. ఇక లేటెస్ట్ గా పద్మ విభూషణ్ చిరంజీవి, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడు, అలాగే ఇతర పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ రోజు హైదరాబాద్ శిల్ప కళావేదిక లో గౌరవ సన్మానం చేయడం జరిగింది.

ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి, ఇంకా లేటెస్ట్ గా ఆయన నంది అవార్డులు, గద్దర్ అవార్డ్స్ పేరిట రాబోతున్నాయని అనౌన్స్ చేయడం గురించి మాట్లాడడం జరిగింది. చిరంజీవి మాట్లాడుతూ భారత ప్రభుత్వం పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి, వారికి సన్మానం చెయ్యాలి అని భావించటం ఇదే మొదటిసారి. దానికి ప్రధాన కారణం యువకులు, డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. దేశంలో పద్మ అవార్డ్స్ వచ్చిన కళాకారులను, ప్రముఖులను గౌరవిస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

ఇక గద్దర్ అవార్డుల గురించి కూడా చిరంజీవి ప్రస్తావిస్తూ నంది అవార్డుకు గద్దర్ అని పేరు పెట్టడం సముచితమే అని అన్నారు. ఇక గత రాజకీయ జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటూ రాజకీయాలలో మాట అనడం.. మాట పడడం తన వల్ల కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప, ఆనందచారి , కేతావత్ సోమలాల్, కూరెళ్ల విఠలాచార్యాలకు గౌరవ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు