Keerthi bhat: రూ.200 ఇస్తా వస్తావా.. అంటే సరే అన్నాను.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Keerthi bhat.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది లేడీ సెలబ్రిటీలు తాము ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నామని.. ఇప్పటికీ అక్కడక్కడ అలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటున్నాం అంటూ మీటూ ఉద్యమంలో భాగంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఈ విషయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక నటి మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటూ ప్రముఖ బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ వెల్లడించడం ఇప్పుడు వైరల్ గా మారింది. మరి అసలు ఏం జరిగిందో.. కీర్తి ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..

Keerthi bhat: Keerthi bhat comments viral on about Casting couch..!
Keerthi bhat: Keerthi bhat comments viral on about Casting couch..!

యాక్సిడెంట్ వల్ల సర్వం కోల్పోయింది..

బిగ్ బాస్ షో తో చాలా మంది పేరు తెచ్చుకోగా.. కీర్తి భట్ కూడా ఆరో సీజన్ లో పాల్గొని మంచి పేరు సొంతం చేసుకుంది. పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది.. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్నాళ్లు కోమాలో ఉండి తిరిగి కోలుకుంది. ఇకపోతే తనకు యాక్సిడెంట్ ఎలా జరిగింది..? ఆ యాక్సిడెంట్ వల్ల తాను ఏం కోల్పోయిందో..? ఇలా అన్ని విషయాలను బిగ్ బాస్ షోలో పూర్తిగా వివరించిన విషయం తెలిసిందే.. ఇక రీసెంట్గా తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది.. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు ఈ జంట.. అందులో భాగంగానే తనకు జరిగిన దారుణమైన అనుభవాలను బయటపెట్టింది..

రూ.200 ఇస్తా వస్తావా అన్నారు..

ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. 2017లో మేము ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. ఆ ప్రమాదంలో నా తల్లిదండ్రులు, అన్నా – వదిన మరణించారు.. అదృష్టం బాగుండి.. నేను ప్రాణాలతో బయటపడ్డాను.. అయితే కొన్నాళ్లపాటు కోమాలో ఉన్నాను.. అప్పుడే దారుణమైన సంఘటనలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. నా కుటుంబానికి యాక్సిడెంట్ అయిన తర్వాత మా బంధువులు నన్ను మంగుళూరు కి తీసుకెళ్లారు.. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను.. నన్ను తెలియని వారు ఎక్కడెక్కడో టచ్ చేసేవారు.. వారు టచ్ చేస్తున్నట్టు తెలిసేది.. కానీ స్పర్శ లేకపోవడం వల్ల వారిని నెట్టెయ్యలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. అయితే కోలుకున్న తర్వాత ఎవరికీ చెప్పకుండా వచ్చేసాను.. అయితే ఎక్కడికైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్తే .. రూ.200 ఇస్తాను.. వస్తావా అని అడిగేవారు.. అంటే సరే అని అనేదాన్ని.. తర్వాత వాళ్ళ చూపులు బట్టి నాకు అర్థం అయ్యేది.. అంటూ కీర్తి తనకు ఎదురైన దారుణాల గురించి చెప్పుకొస్తూ బాధపడింది.

- Advertisement -

కీర్తి భట్ కెరియర్..

ఒకప్పుడు కన్నడ అమ్మాయి అయిన ఈ ముద్దుగుమ్మ.. 2019లో మనసిచ్చి చూడు అనే సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కార్తీకదీపం లో కూడా నటించింది.. ఇక 2022లో బిగ్ బాస్ షోలో పాల్గొని అందరిని ఆకట్టుకోవడమే కాదు తనకు జరిగిన అన్యాయం గురించి వెల్లడించి. ఆడియన్స్ సానుభూతి కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికి అయితే తన కెరియర్లో తనకు జరిగిన బాధలను, అన్యాయాలను, ఇబ్బందులను చెప్పుకొని అందరిని ఆశ్చర్యపరిచింది కీర్తి భట్.. మొత్తానికి అయితే కీర్తి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు