Kamal Haasan : విక్రమ్ ప్రాణం పోసిందా ?

విశ్వ నటుడు కమల్ హాసన్ కు విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వరూపం ఉత్తమ విలన్, పాపనాశం, చీకటి రాజ్యం, విశ్వరూపం-2 లాంటి డిజాస్టర్లు వచ్చిన తర్వాత విక్రమ్ సినిమా వచ్చింది. విక్రమ్ తో కమల్ కెరీర్ ఒక్క సారిగా మలుపు తిరిగింది. ఏకంగా 400 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

నిజానికి విక్రమ్ సినిమా రాకముందు, కమల్ హాసన్ సినీ కెరీర్ ను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ, కమల్ సినీ కెరీర్ కు విక్రమ్ ప్రాణం పోసింది. దీంతో కమల్ మరిన్నీ సినిమాలు చేయాలని చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఇండియన్ – 2 సినిమా పనిలో పడ్డాడు కమల్ హాసన్. దీని తర్వాత శభాష్ నాయుడు సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

వీటితో పాటు మరో డైరెక్టర్ తో సినిమా చేయడానికి కమల్ రెడీ అవుతున్నాడు. కమల్ విశ్వరూపం సినిమాకు ఎడిటర్ గా పని చేసిన మహేష్ నారాయణన్ తో చేయబోతున్నాడు. దీని గురించి మహేష్ నారాయణన్ స్వయంగా వెల్లడించాడు. ఇండియన్2 తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని తెలిపాడు.

- Advertisement -

కాగా, మహేష్ నారాయణన్ కు ఇది తొలి చిత్రమేమీ కాదు. టేకఫ్ అనే సినిమాతో మహేష్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అలాగే ఫాహద్ ఫాజిల్ తో మూడు ఓటీటీ సినిమాలు కూడా చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు