Samyuktha : విరూపాక్ష’ హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నఆ బ్యూటీ ?

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ – సంయుక్త మీనన్ జంటగా రూపొందిన చిత్రం విరూపాక్ష. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే 100 కోట్ల సినిమాగా నిలిచింది.

తొలి రోజు నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 27 రోజులలోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అయితే ఈసినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా రాజీవ్ కనకాల, యాంకర్ శ్యామల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో నటించారు.

ఈ మూవీలో ముందుగా శ్యామలని విలన్ అనుకోగా, సుకుమార్ హీరోయిన్ ని విలన్ గా మార్చిన విషయం తెలిసిందే. ఎవరు ఊహించని
విధంగా సినిమా క్లైమాక్స్ లో సంయుక్త మీనన్ ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు. సినిమా చివరి వరకు ఆ ట్విస్ట్ ని ఎవరూ కనిపెట్టలేరు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా అనుకున్నది సంయుక్త ని కాదట. ఈ పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకున్నారట. కానీ ఆమె ఓ మలయాళం మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాని వదులుకుందట.

- Advertisement -

ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసి.. సంయుక్త కు మంచి పేరు రావడంతో.. ఈ సినిమాలో నటించే అవకాశం కోల్పోయినందుకు చాలా బాధపడుతుందట అనుపమ. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించడం అంటే అనుపమకి చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఇలాంటి పాత్రను కోల్పోయినందుకు అనుపమ చాలా బాధపడుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు