స్టార్ హీరోల సినిమాల రీరిలీజ్ ట్రెండ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆకర్షిస్తోంది. పోకిరి, జల్సాల సినిమాల స్పెషల్ షోల టిక్కెట్ బుకింగ్లు ఊహించిన దానికంటే చాలా రెట్లు పెరిగాయి. జల్సా-4కె స్పెషల్ షోలను అభిమానులు పెద్ద పండగలా జరుపుకున్నారు. బ్లాక్బస్టర్ మూవీని మళ్లీ పెద్ద స్క్రీన్పై చూసి అభిమానులందరూ ఆనందిస్తుండగా, కొంతమంది ఔత్సాహిక అభిమానులు అసలు వేడుక కంటే ఎక్కువ నష్టం చేస్తున్నారు.
జల్సా 4K స్క్రీనింగ్కు సంబంధించిన అనేక వీడియోలు వైరల్గా మారాయి. అతిగా రెచ్చిపోయిన అభిమానులు థియేటర్లలో కొన్ని పెద్ద క్రాకర్లను కాల్చి, థియేటర్కు నష్టం కలిగించిన కొన్ని వీడియోలు ఉన్నాయి. ఇంకొన్ని థియేటర్స్ లో కొంతమంది అభిమానులు పెద్ద స్క్రీన్ను ఒక మూలలో చింపివేయడం మరియు సీట్లను పాడు చేయడం లాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి.
ఈ స్పెషల్ షోల నుండి వచ్చిన కలెక్షన్లు స్వచ్ఛంద సంస్థలకు విరాళాల కోసం కేటాయించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ భారీ వేడుకల కారణంగా థియేటర్లకు జరిగిన ఈ నష్టాలు స్వచ్ఛంద సంస్థకు వచ్చే మొత్తాన్ని తగ్గిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ మాత్రమే చేసి, థియేటర్ యాజమాన్యానికి కానీ థియేటర్ కి కానీ ఎటువంటి నష్టం తీసుకుని రాకుండా సెలబ్రేట్ చేసుకోవాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.
ఈ మితిమీరిన ఉత్సాహం ఇలాగే కొనసాగితే, ఇకపై స్పెషల్ షోలు, బెనిఫిట్స్ షోలు ఉండకపోవచ్చు.