Ram Charan Doctorate : ప్రముఖ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ఇటీవల డాక్టరేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగానే రామ్ చరణ్ ఈరోజు తన సతీమణి ఉపాసన , కూతురు క్లింకారతో సహా చెన్నైకి చేరుకున్నారు. చిత్ర పరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ ను ప్రధానం చేయనున్నట్టు వేల్స్ విశ్వవిద్యాలయం పత్రిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక రామ్ చరణ్ తో పాటు చంద్రయాన్ – 3 ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి వీరముత్తువేల్, త్రివిట్రన్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫౌండర్ , చైర్మన్, డాక్టర్ జి ఎస్ కే వేలు , టేబుల్ టెన్నిస్ ప్లేయర్ పద్మశ్రీ శరత్ కమల్ అచంట లకు ఈ గౌరవ డాక్టరేట్ లను అదే వేదిక పైన ప్రధానం చేయనున్నారు..
గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్..
ఇక ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు చెన్నై పల్లవరంలోని వేల్స్ క్యాంపస్ లో జరిగే యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ పీజీ సీతారాం ముఖ్యఅతిథిగా పాల్గొని.. ఈ గౌరవ డాక్టరేట్ ను రామ్ చరణ్ కు ప్రధానం చేశారు. ఇక యూనివర్సిటీ ఛాన్స్లర్ డాక్టర్ ఐసరి కే.గణేష్ అధ్యక్షత వహించారు.
డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ ..#RamCharan𓃵 #Globalstar #RC16 #RC17 #Gamechenger #VelsUniversity @AlwaysRamCharan pic.twitter.com/yaCuNypyLq
— Filmify Official (@FilmifyTelugu) April 13, 2024
ఉదయం విమానాశ్రయంలో సతీసమేతంగా రామ్ చరణ్..
ఈరోజు ఉదయం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రామ్ చరణ్ సతీసమేతంగా ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకోగా.. అక్కడివారు వీరికి సాదర స్వాగతం పలికారు.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఎయిర్పోర్టులో చరణ్తో పాటు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా కనిపించారు. ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరు కాగా అందులో వంశీ పైడిపల్లి కూడా కనిపించడం గమనార్హం.
డాక్టరేట్ అందుకోవడానికి చెన్నై చేరుకున్న గ్లోబల్ స్టార్..#RamCharan𓃵 #GlobalStarRamCharan #upasanakonidela #VelsUniversity #doctorate #GameChenger #RC16 @AlwaysRamCharan @TeamCharanERA pic.twitter.com/wDIX2Rs9ZJ
— Filmify Official (@FilmifyTelugu) April 13, 2024
చరణ్ పై బాబాయి పవన్ రియాక్షన్ ఇదే..
నిన్నటి రోజున ఈ ప్రకటన రావడంతో రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన పని పక్కన పెట్టి మరీ తన తనయుడు రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ లభించడం పై ప్రశంసించారు.. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ..” చలనచిత్ర రంగంలో తనదైన పంథా లో ప్రయాణిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ కు గౌరవ డాక్టరేట్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. రామ్ చరణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు.. డాక్టరేట్ స్ఫూర్తితో మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని..మరెన్నో పురస్కారాలు ..మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు . ఇక ఈ విషయం చూసిన తర్వాత మెగా అభిమానులు సంతోషంలో ఉబ్బితబ్బిబవుతున్నారు. మొత్తానికైతే రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు కూడా మరికొన్ని గంటల్లో బయటకు రానున్నట్లు సమాచారం.