Punarnavi Bhupalam: ఆ సమస్యతో బాధపడుతున్నా

పునర్నవి భూపాలం.. ఉయ్యాల జంపాల అనే సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన పునర్నవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమెకి సోషల్ మీడియాలో అయితే క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ చలాకీగా ఉండడం, తెలుగు అమ్మాయి కావడంతో మన వాళ్ళు ఎక్కువగా ఆదరించారు. 2015లో “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు” సినిమాలో శర్వానంద్ కూతురు పార్వతి గా నటించింది. ఆ తర్వాత పిట్టగోడ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది.

ఈ చిత్రం తరువాత బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు రియాలిటీ షో ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది పునర్నవి. బిగ్ బాస్ షో తర్వాత సినిమాలలో ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వాటికి నో చెప్పి పై చదువుల కోసం లండన్ వెళ్ళింది.లండన్ లో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది పునర్నవి. అయితే తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది పునర్నవి.

తాను కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డాను అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేసింది. ఈమె ప్రస్తుతం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. ” కొద్ది రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న. నా కొత్త సంవత్సరం ఇలా మొదలైంది. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడడం ఇదే మొదటిసారి. ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్న” అంటూ తన ఫోటో షేర్ చేసింది. ఇక మరో ఫోటో షేర్ చేస్తూ.. ” ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాను” అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు