Shruti Haasan: మైనస్ డిగ్రీలో.. చాలా ఇబ్బందిపడ్డా

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి – శృతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు అభిమానులతో డ్యాన్స్ వేయిస్తున్నాయి.

ఈ చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల చేశారు. ఇందులో ఒకటి ఐటెం సాంగ్, మరో పాట డ్యూయెట్, ఓ టైటిల్ సాంగ్, పూనకాలు అంటూ మరో పాటని కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలోని డ్యూయెట్ సాంగ్ ” నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి అవుతా” అంటూ మెగాస్టార్ – శృతిహాసన్ పై మంచు కొండలలో ఈ పాటని షూట్ చేసిన విషయం తెలిసిందే.

గతంలో ఈ సాంగ్ గురించి మెగాస్టార్ లీక్ కూడా ఇచ్చారు. ఈ పాటని ఫ్రాన్స్ లోని మంచు కొండల్లో చిత్రీకరించారు. మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత గురించి చెప్పుకొచ్చారు మెగాస్టార్. అయితే ఇప్పుడు ఇదే పాట గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ పంచుకుంది శృతిహాసన్. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో మైనస్ డిగ్రీల చలి ఉందని తెలిపింది.

- Advertisement -

ఈ పాట కోసం చీరలో ఆ వాతావరణం లో డాన్స్ చేయడం తనకు ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ అభిమానుల కోసం చేయాల్సిందేనని తెలిపింది. ఆ మంచులో మరో పాట కోసం డాన్స్ చేయనవసరం లేదనుకున్నానని.. ఎందుకంటే ఆ వాతావరణం లో ఎంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యానని తెలిపింది శృతిహాసన్. ఇదిలా ఉంటే.. మరోవైపు శృతిహాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రంతో పాటు, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు