Geethu rayal.. ప్రముఖ బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ ఈ షో ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా తన అందచందాలతో .. గ్లామర్ డోస్ పెంచి ప్రతి ఒక్కరిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొని.. అందరిని తన వైపు తిప్పుకుంది.. అద్భుతమైన ఆట తీరు కనబరిచి.. అనేకమంది అభిమానులను సంపాదించుకుంది.. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ రివ్యూయర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ సెలబ్రిటీగా మారిపోయింది. ఇక తాజాగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.. గత ఐదు నెలలుగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతోందట గీతూ.. మరి ఆ వివరాలు ఏంటి? గీతూ బాధపడుతున్న సమస్య ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ రివ్యూయర్ గా..
బిగ్ బాస్ రివ్యూయర్ గా కెరియర్ మొదలుపెట్టిన గీతూ రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్లి మంచి గుర్తింపు సంపాదించుకుంది.. జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో పాటు అనేక షోలలో కూడా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ సీజన్ కి బిగ్బాస్ బజ్ షో కి యాంకర్ గా కూడా వ్యవహరించింది.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ముక్కుసూటిగా ప్రశ్నలు అడుగుతూ.. వారికి ముప్పు తిప్పలు పెట్టింది.. ముందు ఉన్నది ఎవరు అని చూడకుండా.. తాను అడగాలనుకున్న ప్రశ్నలను నిర్మొహమాటంగా అడిగేసి ప్రజల తరఫున అడుగుతున్నాను అంటూ కామెంట్లు చేసింది. ప్రస్తుతం యాంకర్ ధనుష్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. కొన్ని విషయాలపై మాట్లాడుతోంది..
6 నెలలుగా అలాంటి సమస్యతో..
ఇదిలా ఉండగా చాలా రోజుల క్రితం ఈ చానల్లో ఒక వీడియో పోస్ట్ చేయగా.. ఈమధ్య అసలు మళ్లీ కనిపించడం లేదు గీతూ రాయల్.. అయితే తాజాగా ధనుష్ ఒక వీడియోని పోస్ట్ చేశారు.. అందులో గీతూ ఆరోగ్య పరిస్థితుల గురించి వెల్లడించారు. ఆమె డిప్రెషన్ లో ఉందని గత ఐదు ఆరు నెలలుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ కెరియర్ కొనసాగిస్తుందని.. అయితే ఇప్పుడు పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని వివరించారు. అంతేకాకుండా నేరుగా ఆమె వరకు వెళ్లి వీడియోను తీశాడు.. ఈ క్రమంలోనే అక్కడ గీతూ మాట్లాడుతూ.. నేను బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నాను. అక్కడ అనేక రకాల పదార్థాలను కూడా ట్రై చేశాను.. ముఖ్యంగా చనిపోయేలోపు అన్నీ చూడాలి.. ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతోనే అలా చేశాను.. ఇప్పుడు అలా చేయడం వల్లే నాకు ఆరోగ్య సమస్య వచ్చింది.
కోటిమందిలో ఒకరికి వచ్చే జబ్బు నాకు..
ఇది మాత్రమే కాకుండా నేను విజయవాడకు అమ్మవారి దర్శనం కోసం వెళ్లాను.. కానీ దర్శించుకోలేదు.. అదేవిధంగా తిరుచానూరు కి వెళ్లి అక్కడ కూడా దర్శించుకోకుండా వచ్చేసాను.. నావల్ల నాతో వచ్చిన వాళ్లు కూడా అమ్మవారిని దర్శించుకోలేకపోయారు. అందువల్ల నాకు ఇలా ఆరోగ్య సమస్యలు వచ్చాయేమో.. కోటి మందిలో ఒకరికి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు నాకు వచ్చింది. చిన్న చిన్న ఆసుపత్రిలకు తిరిగితే దాని గురించి తేలింది.. ఇంతకాలం ఈ సమస్యతో ఇబ్బంది పడగా.. తాజాగా ఒక పెద్ద ఆసుపత్రికి షిఫ్ట్ అయ్యాను.. అప్పుడే ఈ ఇన్ఫెక్షన్ బయటపడింది.. కంటిన్యూగా ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.. అందువల్లే నేను పెద్దగా వీడియోలు చేయలేకపోతున్నాను.. కడుపులో వచ్చిన ఈ వైరస్ వల్ల ప్రతిరోజు నరకం చూస్తున్నాను అంటూ గీతూ రాయల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.