Thotapalli Madhu : సావిత్రి – శ్రీదేవి పై సంచలన వ్యాఖ్యలు..!

Thotapalli Madhu.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి నటీమణులలో ప్రథమంగా వినిపించేది మహానటి సావిత్రి, అతిలోకసుందరి శ్రీదేవి.. ఎన్నో చిత్రాలలో నటించి.. ఎన్నో అవార్డులను , రివార్డులను అందుకున్న సెలబ్రిటీలుగా పేరు సంపాదించారు. ముఖ్యంగా వీరి జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి తరం అయిపోయిన తర్వాత మళ్లీ అంతటి పాపులారిటీ కేవలం శ్రీదేవి కే దక్కిందని చెప్పవచ్చు. తమ పాత్రలకు ప్రాణం పెట్టి మరీ నటిస్తూ ఉంటారు ఈ సెలబ్రిటీలు. తాజాగా ఈ హీరోయిన్స్ గురించి ప్రముఖ రచయిత తోటపల్లి మధు పలు విషయాలను వెల్లడించారు.

Thotapalli Madhu : Sensational comments on Savitri - Sridevi..!
Thotapalli Madhu : Sensational comments on Savitri – Sridevi..!

సావిత్రి, శ్రీదేవి పై నటుడు కామెంట్స్..

తోటపల్లి మధు మాట్లాడుతూ.. సావిత్రి, శ్రీదేవి.. ఇద్దరూ కూడా విపరీతమైన మద్యం తాగే వారని.. సావిత్రి కి మద్యం తాగడం అనేది ఎవరు నేర్పించలేదు.. తాగడం అలవాటు చేసుకున్నాక తినడం, తాగడం వల్ల చాలా లావుగా అయిపోతున్నారని ఎవరు చెప్పినా వినేవారు కాదట సావిత్రి. లావు అవుతున్నాననే బెంగతో మరింత ఎక్కువగా తాగే వారని వెల్లడించారు మధు. అలా సావిత్రి తాగి తాగి 14 ఏళ్లు బ్రతికితే.. కానీ అదే అలవాటుతో కేవలం 14 నిమిషాలలో.. 55 ఏళ్లకే శ్రీదేవి చనిపోయింది అంటూ తెలియజేశారు.. ఆ సమయంలో శ్రీదేవికి బీపీ , షుగర్ వంటివి వచ్చాయని కూడా వెల్లడించారు. అంతేకాదు శ్రీదేవికి కూడా అప్పటికే తాగే అలవాటు ఉందని తెలిపారు.

ఆ బెంగతోనే శ్రీదేవి ఉప్పు , కారం తినలేదు..

శ్రీదేవికి అందం విషయంలో చాలా మక్కువ అని.. ముఖ్యంగా కత్రినా కైఫ్ , ఐశ్వర్యరాయ్ వంటి హీరోయిన్లు వస్తే తన పరిస్థితి ఏంటో అని అనుకునే దుస్థితి ఉందని ఆ కారణంగానే పలు రకాల సర్జరీలు కూడా శ్రీదేవి చేయించుకుందంటూ తెలిపారు. శ్రీదేవి అందంగా కనిపించడం కోసం ఎక్కువగా తినేవారు కాదని.. ఆమె తినే వాటిలో ఉప్పు, కారం అసలు ఉండేవి కాదని.. తాగే అలవాటు ఉండడం వల్ల ఈమె చివరికి తాగి బాత్రూం లో వెళ్లి.. బాత్ టబ్ లో పడి కోమాలోకి వెళ్లిపోయిందని.. అలా అక్కడే శ్రీదేవి మరణించడానికి కేవలం 14 నిమిషాల సమయం పట్టిందంటూ తెలిపారు.

- Advertisement -

మేకప్ పనే మత్తు ప్రపంచంలో ఊగుతున్నారు..

మేకప్ అనేది కూడా ఒక మత్తు ప్రపంచం.. దీనికి అలవాటు పడితే అసలు ఎవరు ఉండలేరని.. గతంలో చాలామంది అందంగా కనిపించడం కోసమే మద్యం తీసుకునేవారు కానీ ప్రస్తుతమున్న పరిస్థితులలో చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారని, మాదకద్రవ్యాలు వాడితే మరింత అందంగా కనిపిస్తారనే విధంగా వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నారని.. అందుకే చాలామంది ఇంజక్షన్లు కూడా వేయించుకుంటున్నారు.. వర్కౌట్లు కూడా ఎక్కువ సేపు చేస్తున్నారు అంటూ తోటపల్లి మధు తెలియజేశారు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీల గురించి తోటపల్లి మధు చేసిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా అందం కోసం శ్రీదేవి చేసిన పనికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు ఇక మద్యం మనిషి జీవితాన్ని నాశనం చేయడమే కాదు ప్రాణాలు తీస్తుందని ఎంత తెలిసిన సెలబ్రిటీలు మాత్రం అలవాటును మానుకోలేకపోతూ వుండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు