Nayanatara : అతని కోసం ప్రత్యేక పూజలు చేసిన నయనతార

Nayanatara: ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న నయనతారకు ఉన్న క్రేజ్ అంతా కాదు. ఈ బ్యూటీ… దేశవ్యాప్తంగా పాపులర్ అయిన హీరోయిన్ అని చెప్పవచ్చు. లేడీ సూపర్ స్టార్ గా దక్షిణ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఇప్పుడు ఊపేస్తోంది. దాదాపు సినిమా ఇండస్ట్రీలో 16 సంవత్సరాలుగా రాణిస్తోంది నాయనతార. అంతేకాకుండా పెళ్లైనప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా ఈ బ్యూటీ కి ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ… లేదా బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కానీ… తమిళ ఇండస్ట్రీలో అయినా సరే… ఎక్కడ చూసినా నయనతారకు వరుస అవకాశాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే… ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ కూడా పెంచిందట. ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం. 10 కోట్లు ఇవ్వకపోతే సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదట. ఇద్దరు పిల్లలు ఉన్నా సరే… రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే సినిమాలు చేసేందుకు సిద్ధమవుతుందట.

ఇది ఇలా ఉండగా తాజాగా నయనతారకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన భర్తతో కలిసి తమిళనాడులోని ఓ గుడిలో మెరిసింది అందాల తార నయనతార. తన భర్త కోసం అలాగే పిల్లల ఆరోగ్యం కోసం… ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిందట నయనతార. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు