Naatu Naatu: రోజు రోజుకు పెరిగిపోతున్న క్రేజ్..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీ సినీ ప్రపంచాన్నే ఒక ఊపు ఉపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, సెలబ్రెటీలు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కూడా గెలుచుకుంటుంది. ఇటీవల సినిమా రంగంలోనే అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ కు కూడా ఈ చిత్రం నామినేట్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది. దీంతో తెలుగోడి సత్త మరోసారి ఎల్లలు దాటింది. ఈ సాంగ్ లోని స్టెప్స్ ప్రపంచ వ్యాప్తంగా పలువురి సెలబ్రెటీల నుంచి మన్ననలు పొందింది. ఇంకా చాలా మంది ఈ పాటకు కాలుకదుపుతూ.. చిందేశారు. దీంతో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది.

తాజాగా ఈ నాటు నాటు సాంగ్ ఫీవర్ ఇండియాలోని సౌత్ కొరియన్ ఎంబసీని తాకింది. ఎంబసీ సిబ్బంది ‘నాటు నాటు’ పాటకు స్టెప్స్ వేశారు. సిబ్బంది తో పాటు దౌత్యవేత్త చాంగ్ జే బోక్ (Chang Jae-bok) డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ప్రధాన మంత్రి మోడి కూడా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక సద్గురు జగ్గదేవ్ కూడా దీనిపై స్పందించాడు.

- Advertisement -

నాటు నాటు పాటకు ప్రపంచమే తాండవం చేస్తోంది అంటూ కొరియన్ ఎంబసీ సిబ్బంది నాటు నాటు పాటకు డాన్స్ స్టెప్స్ వేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అలాగే ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళితో పాటు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు