దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీ సినీ ప్రపంచాన్నే ఒక ఊపు ఉపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, సెలబ్రెటీలు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కూడా గెలుచుకుంటుంది. ఇటీవల సినిమా రంగంలోనే అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ కు కూడా ఈ చిత్రం నామినేట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది. దీంతో తెలుగోడి సత్త మరోసారి ఎల్లలు దాటింది. ఈ సాంగ్ లోని స్టెప్స్ ప్రపంచ వ్యాప్తంగా పలువురి సెలబ్రెటీల నుంచి మన్ననలు పొందింది. ఇంకా చాలా మంది ఈ పాటకు కాలుకదుపుతూ.. చిందేశారు. దీంతో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది.
తాజాగా ఈ నాటు నాటు సాంగ్ ఫీవర్ ఇండియాలోని సౌత్ కొరియన్ ఎంబసీని తాకింది. ఎంబసీ సిబ్బంది ‘నాటు నాటు’ పాటకు స్టెప్స్ వేశారు. సిబ్బంది తో పాటు దౌత్యవేత్త చాంగ్ జే బోక్ (Chang Jae-bok) డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై ప్రధాన మంత్రి మోడి కూడా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక సద్గురు జగ్గదేవ్ కూడా దీనిపై స్పందించాడు.
నాటు నాటు పాటకు ప్రపంచమే తాండవం చేస్తోంది అంటూ కొరియన్ ఎంబసీ సిబ్బంది నాటు నాటు పాటకు డాన్స్ స్టెప్స్ వేసిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. అలాగే ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో పాటు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.
World dances to Naatu Naatu! Congratulations to the #RRR team and to the Ambassador of the Republic of Korea & his team for shaking their leg to Naatu Naatu! -Sg @RokEmbIndia@AlwaysRamCharan @tarak9999 @ssrajamouli https://t.co/s2MWiSEpai
— Sadhguru (@SadhguruJV) February 28, 2023
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News