Shaakunthalam: సమంత తో మనం ఎప్పుడు మూవీ చేద్దామని అడిగిన సీత

మృణాల్ ఠాకూర్. ఇప్పడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. 2022 లో సీతారామం చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ లో ప్రవేశించి సీత గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మృణాల్ ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న 30వ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. అందరి హీరోయిన్ల లాగా అన్ని రకాల సినిమాలు చేయకుండా సెలక్టివ్ గా నెమ్మదిగా మూవీస్ చేస్తుంది.

అయితే మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ గా నటించిన బాలీవుడ్ మూవీ గుమ్రా ఏప్రిల్ 7 న విడుదలై మంచి టాక్ తో రన్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమా కి రీమేక్. హిందీ లో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటించగా, హీరోయిన్ గా పోలీస్ ఆఫీసర్ రోల్ లో మృణాల్ నటించింది.

అయితే ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ ట్విట్టర్ వేదిక గా అభిమానులతో చాట్ చేసింది. అందులో భాగంగా తాను చేస్తున్న లేటెస్ట్ మూవీస్ గురించి చెప్పింది. అంతే కాదు సీతారామం 2 ఉంటుందా అని ఒక అభిమాని అడిగితే, సీతారామం లాంటి సినిమా నాకు దొరకడం నా అదృష్టం. కానీ దానికి సీక్వెల్ ఉంటుందో లేదో తెలియదు. ఉండాలని అనుకుంటున్నాను. అని అంది.

- Advertisement -

ఏప్రిల్ 9 రాత్రి మాత్రం మృణాల్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ కి రిప్లై ఇచ్చింది. అదేంటంటే శాకుంతలం ప్రమోషన్ లో భాగంగా సమంత ట్విట్టర్ లో శాకుంతలం మూవీ గురించి అడగమని సామ్ ట్వీట్ వేసింది. చాలా మంది అభిమానులతో కూడా ముచ్చటించింది. ఈ క్రమంలో సామ్ వేసిన ట్వీట్ కి మృణాల్ ఠాకూర్ ఒక రిప్లై ఇచ్చింది.

అదేంటంటే శాకుంతలం చూడటానికి వేచి ఉండలేను! మీరు చాలా ఇంస్పైరింగ్ గా ఉన్నారు సామ్. “మేమిద్దరం కలిసి సినిమా ఎప్పుడు చేస్తున్నామన్నదే నా ప్రశ్న” అని మృణాల్ ఠాకూర్ రిప్లై ఇచ్చింది. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updatesGossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు