Guntur kaaram: మహేష్ బాబు గుంటూరు కారం నుంచి బిగ్ అప్డేట్.. రెండో పాట రెడీ..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఇప్పుడు మరొక అప్డేట్ వచ్చింది. ఇదివరకే ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ “దమ్ మసాలా” అనే పాటను గత కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా.. ఇప్పుడు రెండో పాట కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక అలాంటి అభిమానుల కోసం నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తాజాగా శుభవార్త తెలిపారు.

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ మై బేబీ అనే పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 11న సోమవారం సాయంత్రం 4:05 గంటలకు “ఓ మై బేబీ” పాటను విడుదల చేయనున్నారు. ఇక డిసెంబర్ 13వ తేదీన అంటే బుధవారం ఫుల్ పాటను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక స్టిల్ లో సూపర్ స్టార్ , ఘట్టమనేని ఫ్యాన్స్ అలాగే ప్రేక్షకుల చూపును ఈ పోస్టర్ చాలా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

ఇకపోతే మహేష్ బాబు కి శ్రీ లీల ముద్దు పెట్టారు.. హీరోకి హీరోయిన్ ఎందుకు ముద్దు పెట్టారనేది.. ఆ పాటలో అలాగే ఈ సినిమాలో కూడా చూడాలి అంటూ ఈ పాట చాలా రొమాంటిక్ గా సాగుతోంది. ఇకపోతే తమన్ పాటకు మంచి మెలోడీ ట్యూన్ అందించాలని చెప్పవచ్చు. ఇకపోతే గుంటూరు కారం చిత్రీకరణ ఈనెలాఖరులోపు పూర్తి కానున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టగా సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే సంక్రాంతి బరిలో దిగనున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఇదివరకే త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో ఖలేజా, అతడు సినిమాలు రాగా ఇప్పుడు గుంటూరు కారం సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు