యూట్యూబ్ వీడియోస్ ద్వారా పాపులర్ అయిన ఛాయ్ బిస్కెట్ సంస్థ, ప్రస్తుతం సినిమా ప్రొడక్షన్ మారిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలనే ఈ ప్రొడక్షన్ నుంచి సుహాస్ హీరోగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమాని చేసారు. ఈ సినిమా మంచి విజయం సాధించటంతో ఛాయ్ బిస్కెట్ కి మంచి గుర్తింపు లభించింది.
రైటర్ పద్మభూషణ్ సినిమా సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ ఛాయ్ బిస్కెట్ మేమ్ ఫేమస్ అనే మరో సినిమాతో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సందర్బంగా సెలెబ్రెటీలందరితో ప్రమోషన్స్ చేయించిన మూవీ టీం ఈ సినిమా ప్రీమియర్ షోని సూపర్ స్టార్ మహేష్ బాబుకి చూపించారు. గతంలో కూడా రైటర్ పద్మభూషణ్ సినిమాని మహేష్ కి చూపించగా, మహేష్ తన ట్వీట్స్ ద్వారా ఆ మూవీ టీంని అభినందించారు. ఆ తరువాత సినిమా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.
అయితే అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ, మేమ్ ఫేమస్ సినిమాని కూడా మహేష్ బాబు కి చూపించగా, ఈసారి మహేష్ మరో మెట్టు ఎక్కి సినిమా గురించి ట్వీట్ చేయడమే కాకుండా , ఆ సినిమాకి దర్శకత్వం వహించిన సుమంత్ ప్రభాస్ కి మహేష్ నిర్మాణ సంస్థ అయిన GMB ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నెక్స్ట్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తూ ట్వీట్ చేసారు. మహేష్ ట్వీట్ తో మరింత ఉత్సాహంగా మారిన మూవీ టీం ఆయనకీ థాంక్స్ చెబుతూ ప్రెస్ మీట్ కండక్ట్ చేసారు. మహేష్ లాంటి హీరో సినిమా చూసి, నెక్స్ట్ సినిమాకి ఆయన ప్రొడక్షన్ లో ఛాన్స్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News