Natti Kumar.. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో పలు ప్రకంపనలను సృష్టిస్తోంది. సీఎం జగన్ టాలీవుడ్ చిత్ర సీమను భయపడుతున్నారంటూ ఆయన ఆరోపించారు.. శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న నిర్మాత నట్టి కుమార్ జగన్ తో పాటు పోసాని కృష్ణ మురళి పై కూడా నిప్పులు చెరిగారు.. జగన్ చేసే పనుల వల్ల ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని.. ప్రజలంతా కూటమి గెలవాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.. ఎక్కడి నుంచో వచ్చిన ఎన్నారైలు కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు.. కానీ సినిమా వారు మాత్రం ఎందుకు బయటకు రావడం లేదు అంటూ ఆయన ప్రశ్నించారు.
చిత్రసీమను జగన్ భయపడుతున్నారు..
ముఖ్యంగా చిత్ర సీమలో ఉన్న ప్రముఖులను జగన్ భయపెడుతున్నారు.. సినిమా వాళ్ళను తిట్టడానికే పోసాని కృష్ణమురళికి ఎఫ్డిసి పదవి ఇచ్చారు. అందుకే ఇప్పుడు జగన్ గురించి మాట్లాడడానికి ఏ ఒక్క సెలబ్రిటీ ముందుకు రావడం లేదు అంటూ విమర్శించారు..
పోసాని కృష్ణమురళి కూడా బెదిరించే ధోరణిలోనే మాట్లాడుతున్నారని.. సినిమా వారంతా ధైర్యంగా బయటకు వచ్చి మీకు ఇష్టమైన వారికి మద్దతు పలకాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు..
జూనియర్ ఎన్టీఆర్ కూటమికి సపోర్ట్ చేయాలి..
ఇక ఏపీతోపాటు ఇండస్ట్రీ బాగుండాలంటే కూటమి అధికారంలోకి రావాలి అని జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా కూటమికి సపోర్ట్ చేయాలని కూడా తెలిపారు. పోసాని మైకు ముందుకొచ్చి ఏదేదో వాగుతున్నాడు.. జగన్ ని చంద్రబాబు చంపేస్తానని అన్నారంటూ పిచ్చి వాగుడు వాగుతున్నాడు.. ముఖ్యంగా పోసానికే దమ్ము ఉంటే కోడి కత్తి ,వివేక మర్డర్, గులకరాయు డ్రామాల గురించి నోరు విప్పి మాట్లాడమని సవాలు విసురుతున్నారు.
ముద్రగడపై కూడా అనుచిత వ్యాఖ్యలు..
అంతేకాదు తాజాగా ముద్రగడపై కూడా ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం. కన్న బిడ్డ మీపై విమర్శలు సంధిస్తోంది.. పవన్ లక్ష మెజారిటీతో గెలవబోతున్నారు.. జగన్ ముద్రగడకు ఏమి హామీ ఇచ్చాడు.. కాపులకు కాపులే శత్రువు అంటూ ముద్రగడ వ్యవహార శైలి ఉందని ఆయన యద్దేవా చేశారు.. ఇకపోతే సినీ పరిశ్రమకు సమస్యలు వస్తే అండగా నిలబడే చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి నిర్మొహమాటంగా జగన్ చేసే అన్యాయాలను ఎదిరించాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా గతంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు తగ్గించి హీరోలకు అటు నిర్మాతలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని మహేష్ బాబు , చిరంజీవి, ప్రభాస్ లాంటి ఇండస్ట్రీ స్టార్స్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి టికెట్లు రేట్లు పెంచేలా ప్రయత్నం చేశారు.. ఇక ఈ మేరకు సీఎం జగన్ కూడా టికెట్లు రేట్లు పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించారు.. అయితే ఇలాంటి సమయంలోనే కొంతమంది ఆయనపై విమర్శలు గుప్పించారు.. చిత్ర పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నారు అంటూ వార్తలు సంధించారు.. ఈ నేపథ్యంలోనే నట్టి కుమార్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి.. మరి దీనిపై సెలబ్రిటీలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.