Keerthy Suresh
నిన్న మొన్నటి వరకు హీరోయిన్ కీర్తి సురేష్ కు టాలీవుడ్ సినిమాలు చేతినిండా ఉండేవి. నిత్యం ఎదో ఒక తెలుగు సినిమా షూటింగ్ తో
లేదా సినిమా రిలీజ్ తో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉండేది కీర్తి సురేష్. అయితే ప్రస్తుతం చూస్తే కీర్తి సురేష్ పరిస్థితి అలా లేదనే చెప్పాలి. ఆమె ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా ఐతే హిట్ లేదా డిజాస్టర్లుగా మిగిలిపోతుండటంతో కీర్తి సురేష్ కు తెలుగులో ఆఫర్స్ బాగా తగ్గాయి. దాంతో ప్రస్తుతం తమిళ్ సినిమాలకు మాత్రమే పరిమితం అయింది.
అయితే ఇటీవలనే ఆమెకు టాలీవుడ్ లో రాబోతున్న ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. చాలా రోజులు ఆ మూవీ టీం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసారు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఆ ఆఫర్ ను కేర్ చేయలేదు. తమిళ్ సినిమాల మోజులో పడి ఆ టీం ను తన డేట్స్ కోసం చాలా రోజులు వెయిట్ చేయించింది.
దాంతో ఆ మూవీ టీం ఇక కీర్తి సురేష్ కోసం ఎదురు చూడటం వెస్ట్ అని రియలైజ్ అయ్యి, వేరే హీరోయిన్ తో ఇటీవలనే సినిమా లాక్ చేసారు.
అయితే ఈ సినిమా మరేదో కాదు నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న తాండేలు సినిమా. మత్స్యకారుల జీవితం నేపథ్యంతో ఒక రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో గీత ఆర్ట్స్ నుంచి సినిమాలు రావడం లేదు. దాంతో చాలా గ్యాప్ తరువాత గీత ఆర్ట్స్ నుంచి రాబోతున్న సినిమా అవడంతో అల్లు అరవింద్ ఈ సినిమా బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు ఇటీవలనే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి ను కన్ఫామ్ కూడా చేసేసారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాపై మూవీ టీం చాలా నమ్మకంగా ఉన్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.