Kangana Ranaut: ఎన్నికల తర్వాత తగ్గేదే లేదంటున్న కంగనా ?

Kangana Ranaut:  ఇండస్ట్రీలో కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… విమర్శలకు మారుపేరుగా కంగన ఉంటుందన్న సంగతి తెలిసిందే. హిమాచల్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ హీరోయిన్గా అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలో రాణించారు. అలాగే పద్మశ్రీ అవార్డు కూడా 2020 సంవత్సరంలో దక్కించుకున్నారు కంగనా.

2006 సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో ఒక నటిగా కొనసాగుతున్నారు కంగనా. తన కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలను విజయవంతం చేసుకున్నారు కంగనా. అలాంటి కంగనా ఇప్పుడు పాలిటిక్స్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి పార్టీలో చేరిన ఈ బ్యూటీ హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తుంది.

గెలుపు లక్ష్యంగా ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది కంగనా. అయితే ఈ బ్యూటీ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలు చేయదని కొంతమంది అనుకున్నారు. అయితే దీనిపై కంగనా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ అవకాశాలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తానని కంగనా వెల్లడించారట. ఎంపీగా గెలిచినా కూడా తాను సినిమాలు చేస్తానని చెప్పారట. దీంతో కంగనా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

- Advertisement -

కాగా ఇప్పటికే కంగనా హిందీ, తమిళ్ లో ఓ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా సైన్ చేసింది. ఎన్నికల తర్వాత ఈ సినిమా షూటింగ్ లో కూడా కంగనా పాల్గొననున్నట్లు సమాచారం అందుతుంది. అటు కంగనా నటించిన ఎమర్జెన్సీ సినిమా జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు