Dhanush : మళ్లీ డిమాండ్ చేస్తున్న ధనుష్.. ఎన్ని కోట్లంటే..?

Dhanush : మళ్లీ డిమాండ్ చేస్తున్న ధనుష్.. ఎన్ని కోట్లంటే..?ఈ మధ్యకాలంలో హీరోలంతా భాషతో సంబంధం లేకుండా వరుసగా తమ సినిమాలను విడుదల చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తూ సక్సెస్ అవుతూ.. మరోపక్క పారితోషకం విషయంలో డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా పారితోషకం విషయంలో భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ధనుష్ సినిమా లైనప్..

భారతీయ సినిమాలో అత్యంత బిజీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ హీరో గానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా పేరు దక్కించుకున్నారు.. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. రాయన్ , కుబేర అనే రెండు సినిమాల్లో కూడా చేస్తున్నారు.. ధనుష్ ప్రధాన పాత్రలో రాయన్ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇది ధనుష్ ( Dhanush ) కి 50వ సినిమా కావడం విశేషం.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ధనుష్ కుబేర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక మందన నటిస్తోంది.. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.. దీనితోపాటు దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా చివరి దశకు చేరుకోగా.. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు..ఇక అలాగే హిందీలో రంజన్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన చిత్రం , తమిళంలో మారి సెల్వరాజ్ , నెల్సన్ మరియు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఒక్కొక్క చిత్రంతో ధనుష్ లైనప్ ఇప్పుడు కొనసాగుతోంది.. ఇక ఈ జాబితాలో చేరిన మరో తాజా చిత్రం ఇళయరాజా బయోపిక్..

ఇళయరాజా మూవీ కోసం ధనుష్ డిమాండ్..

ఇందులో ఇళయరాజా గా నటించడానికి ధనుష్ కమిట్ అయ్యారు.. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సంగీత విద్వాంసుడు ఇళయరాజా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కమల్ హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది.. ఈ సినిమా కోసం ధనుష్ ఎంత పారితోషకం తీసుకున్నారు అనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ధనుష్ ఒక పార్ట్ కి రూ.50 కోట్లు చొప్పున రెండు భాగాలకి రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ..ఇకపోతే ఈయన మునపటి చిత్రం కెప్టెన్ మిల్లర్ కోసం కేవలం రూ .30 కోట్ల పారిపోషకం మాత్రమే తీసుకున్న ధనుష్ ఈ సినిమా కోసం ఏకంగా రూ .100 కోట్లు తీసుకుంటుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ధనుష్ ఈ రేంజిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు