Allu Arjun : మళ్ళీ మెగా మౌనం..అది నిజమేనా..?

Allu Arjun :  అల్లు అర్జున్ ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంతకుముందు ప్రభాస్, మహేష్ మాత్రమే ఈ ఘనతను దక్కించుకోగా.. ఇప్పుడు బన్నీ కూడా ఆ లిస్టులోకి చేరిపోయారు. ఇక అంతేకాదు తన చేతుల మీదుగా తన విగ్రహాన్ని తానే స్వయంగా ఆవిష్కరించారు బన్నీ.. ఇక ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ అయ్యాయి.. ఇక అటు బన్నీకి సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.. అయితే ఇక్కడ ఆశ్చర్యకరం ఏమిటంటే సినీ ఇండస్ట్రీ నుంచి, రాజకీయ నాయకుల నుంచి, అభిమానుల నుంచీ కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు లభిస్తుంటే.. మెగా కాంపౌండ్ నుంచి స్పందన అంతగా రాకపోవడం మళ్లీ కొత్త అనుమానాలకు దారితీస్తోంది.

మెగా కాంపౌండ్ నుంచి బన్నీకి అందని ప్రశంస..

మెగా కాంపౌండ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్ బన్నీ మైనపు విగ్రహం పై ఇప్పటివరకు స్పందించకపోవడమే ఇందుకు కారణం.. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపించే చిరంజీవి కూడా ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. ఇక మెగా కాంపౌండ్ లో కీలకమైన చిరంజీవి , రామ్ చరణ్ ఇద్దరూ కూడా బన్నీ మైనపు విగ్రహం గురించి స్పందించకపోవడంతో చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, బన్నీ మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయంటూ ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈమధ్య అవి కాస్తా తగ్గాయి అనుకున్న సమయంలో తాజాగా ఇప్పుడు మరొకసారి ఈ వార్త తెరపైకి రావడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ అయితే సరేసరి..

ఇక మరొకవైపు పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అసలు పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ గురించి ఈ మధ్యకాలంలో ప్రస్తావించడమే మరిచిపోయారు.. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు.. కానీ అల్లు అర్జున్ మైనపు విగ్రహం పై మాత్రం ఆయన మౌనం వహించడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది.. ఇకపోతే ఇలా మెగా కాంపౌండ్ కి చెందిన వ్యక్తులంతా కూడా మౌనం వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు ..ఉన్నంతలో వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి దుర్గా తేజ.. బన్నీ ( Allu Arjun ) సాధించిన ఘనతను మెచ్చుకున్నారు. అతడికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. కానీ మెగా కాంపౌండ్ లో ఉన్న కీలకమైన వ్యక్తులు చిరంజీవి , పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ లు అల్లు అర్జున్ ను పట్టించుకోవడంలేదనే మాటలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా కాకపోయినా వ్యక్తిగతంగా మెచ్చుకొని ఉంటారు అని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు తగ్గలేదు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు