కొద్ది రోజుల క్రితం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇది టాలీవుడ్, అది బాలీవుడ్, అక్కడ కోలీవుడ్, ఇక్కడ శాండిల్వుడ్, మాలీవుడ్ అంటూ బార్డర్స్ ఉండేవి. ఒక ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, డైరెక్టర్లు అదే ఇండస్ట్రీలో సినిమాలు చేసేవాళ్లు. పక్క ఇండస్ట్రీలో వచ్చే సినిమాలను రీమేక్ చేసేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఇండస్ట్రీల మధ్య ఉన్న గీతలు చేరిగిపోయాయి. ఒక ఇండస్ట్రీకి చెందిన హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్లు, నిర్మాతలు ఇతర ఇండస్ట్రీల్లో నటిస్తున్నారు. సినిమాలు చేస్తున్నారు.
అలాగే ఒక ఇండస్ట్రీలో వచ్చే సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడి ప్రేక్షకుల కూడా అలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. అందులో భాగంగానే నేచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ దసరా కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రమోషన్లను ఆ రేంజ్ లోనే చేస్తున్నారు. లక్నోలో ట్రైలర్ రిలీజ్ చేయడం, బీ టౌన్ విధుల్లో నాని ఫుడ్ విక్రయించడం, కీర్తి సురేష్ కల్లు తాగడం ఇలా వినూత్నంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.
అయితే, దసరా మూవీకి బాలీవుడ్ మీడియా పెద్దగా సపొర్ట్ చేయడం లేదు. దసరా మూవీకి సంబంధించి ఎలాంటి న్యూస్ పబ్లిష్ చేయడం లేదు. అలాగే దసరా టీం ను ఇంటర్వ్యూ చేయడానికి కూడా బాలీవుడ్ మీడియా ముందుకు రావడం లేదు. కానీ, బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న భోళా సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో దసరా టీం చేసేదేమీ లేక సోషల్ మీడియా సాయంతోనే తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటుంది.
దసరా మూవీకి బాలీవుడ్ మీడియా సపొర్ట్ చేయకపోవడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలకు తెలుగు మీడియా సపొర్ట్ చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మస్త్ర సినిమాకు తెలుగు మీడియా బ్రహ్మరథం పట్టింది అంటూ గుర్తు చేస్తున్నారు. బాలీవుడ్ మీడియా ప్రవర్తన మారుకుంటే, టాలీవుడ్ లో బాలీవుడ్ సినిమాలకు అతి గతి ఉండదని తెలుగు మూవీ లవర్స్ హెచ్చరిస్తున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News