Nidhi Agarwal: గేమింగ్ యాడ్స్ ప్రమోట్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ. ఆఫర్లు లేక?

సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో యూత్ క్రష్ లిస్ట్ లో చేరిపోయిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. హైదరాబాద్ కి చెందిన ఈ హీరోయిన్ ముందుగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం బాలీవుడ్ లోనే. 2017లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన “మున్నామైఖేల్” సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగు ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపింది. 2018 లో నాగచైతన్య హీరోగా నటించిన “సవ్యసాచి” అనే మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా మొదటి సినిమాతో నిరాశే ఎదురైంది. ఆ తర్వాత నటించిన mr మజ్ను కూడా ఫెయిల్ అవ్వడంతో నిధి అగర్వాల్ కి ఐరన్ లెగ్ అనే టాగ్ పడింది.

కానీ 2019 లో ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా నిధి అగర్వాల్ కి లక్ తగిలింది. ఈ మూవీ లో హీరోయిన్ గా మంచి క్యారెక్టర్ దొరికింది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆఫర్లు వెల్లువలా వచ్చి పడతాయనుకుంది. కానీ అంతగా రాలేదు. అయితే తమిళం లో మాత్రం రెండు మూవీస్ చేసింది. చివరగా తెలుగులో 2022 లో వచ్చిన “హీరో” సినిమాలో కనిపించింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. అందువల్ల ఈ అమ్మడికి ఇప్పుడు మూవీ ఆఫర్స్ కరువయ్యాయి.

ప్రస్తుతం సినిమా ఆఫర్లు ఏమి లేకనేమో, గత కొన్ని రోజులుగా నిధి అగర్వాల్ తన ఇన్స్టా గ్రామ్ పేజీలో బెట్టింగ్ యాప్స్, అలాగే గేమింగ్ యాప్స్ లను ప్రమోట్ చేస్తుంది. ఇప్పడు నిధి చేతిలో ఉన్న ఒకేఒక్క సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుంది. అయితే ఈ సినిమా 2024 లో విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు నిధి అగర్వాల్ ఇలాగే యాడ్స్ చేస్తూ ఉంటుందా? లేదా ఏదైనా మూవీ ఆఫర్ వస్తుందా అనేది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు