Allu Sneha Reddy: తిరుమలలో బన్నీ సతీమణి.. సింపుల్ గా ఏం చేసిందంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. బన్నీ భార్యగా అందరికీ తెలిసినా, సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండటం వల్ల అందరీ కంట కనిపిస్తుంది. ఇటీవల బన్నీ.. స్నేహతో కలిసి కొన్ని రోజుల పాటు లండన్ లో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. భార్య స్నేహారెడ్డి తో పాటు పిల్లలతో కలిసి విదేశీ లోకేషన్లు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఈ జంట లండన్ నుండి హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. అయితే ఆమె లండన్ నుండి తిరిగి రాగానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే బన్నీ కానీ, పిల్లలు కానీ ఆమె వెంట రాలేనట్టుగా కనిపిస్తుంది. హైదరాబాద్ కి రాగానే శ్రీవారిని దర్శించుకున్నారు స్నేహ రెడ్డి. అయితే ఎవరైనా సెలబ్రిటీలు తిరుమలకు వెళితే పెద్ద ఎత్తున హంగామా చేస్తారు.

కానీ స్నేహ ఎలాంటి హంగామా లేకుండా చాలా సింపుల్ గా, ఫ్యామిలీ కూడా లేకుండా వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకొని రావడం విశేషం. స్నేహ దీపాలు వెలిగిస్తూ కాలినడకన మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడంతో చాలా సింపుల్ గా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్లు. దీంతో ఆమె దీపాలు వెలిగిస్తున్న ఫోటోలు, నడిచి వెళుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు