Allu Aravind.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట నటుడుగా కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయ్యారు అల్లు అరవింద్.. ఈయన తండ్రి అల్లు రామలింగయ్య కూడా నటుడుగా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. మెగా కుటుంబం అనే బ్రాండ్ తో ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న అల్లు అరవింద్.. గీత ఆర్ట్స్ బ్యానర్ పైన ఎన్నో చిత్రాలను తెరకెక్కించి భారీ సక్సెస్లను దక్కించుకున్నారు.
బడా నిర్మాత గా..
ఇక ఈయన కుమారులలో అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదిస్తూ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. అల్లు శిరీష్ కూడా హీరోగా పలు సినిమాలలో నటించినా సక్సెస్ కాలేకపోతున్నారు.. పెద్ద కుమారుడు అల్లు బాబి మాత్రం బిజినెస్ వైపుగా అడుగులు వేస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు.అలాగే అల్లు అరవింద్ చిన్న చిన్న చిత్రాలను నిర్మించడం కోసం గీత ఆర్ట్స్-2 అనే బ్యానర్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది యంగ్ హీరోలకు అవకాశాలను కల్పిస్తున్నారు. ప్రస్తుతం గీత ఆర్ట్స్ బ్యానర్ పైన నాగచైతన్య ,సాయి పల్లవి కాంబినేషన్లో తండేల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
కొత్త కారు కొన్న అల్లు అరవింద్..
అంతేకాదు డిజిటల్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు అల్లు అరవింద్.. ఆహా అనే ఓటీటీ సంస్థ కూడా ఉన్నది. ఇలా అన్ని వైపుల నుంచి అల్లు అరవింద్ కుటుంబానికి భారీగానే ఆదాయం వస్తోంది. ఇప్పుడు తాజాగా అల్లు అరవింద్ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది. ఇప్పటికే తన దగ్గర నాలుగు కార్లు ఖరీదైనవి కూడా ఉన్నప్పటికీ రీసెంట్గా BMW I7 అనే ఎలక్ట్రిక్ కార్ ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.
టాలీవుడ్ లో ఈయన దగ్గర మాత్రమే..
ఈ ఎలక్ట్రిక్ కార్ ను ఇటీవల అల్లు అరవిందే తమ ఇంటికి హోమ్ డెలివరీ కూడా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది ..అల్లు అరవింద్ తన భార్యతో కలసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నట్టుగా తెలుస్తోంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియాలో ఈ కారు విలువ సుమారుగా రూ.2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఈ కారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ , తమిళనాడు విజయ దళపతి వద్ద మాత్రమే ఇలాంటి కారు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో అల్లు అరవింద్ దగ్గర ఉండడం గమనార్హం.
అల్లు అర్జున్ కెరియర్..
అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ భారీ పాపులారిటీ సొంతం చేసుకునీ.. వరుస సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.. పుష్ప వంటి చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకొని.. ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.ఆ తర్వాత మరో పాన్ ఇండియా డైరక్టర్ కి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
View this post on Instagram