Karthik Subbaraj: జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా కోసం మొదట టాలీవుడ్ ఆ యంగ్ హీరోను అనుకున్నారట

2014 లో తమిళ్ లో వచ్చిన జిగర్తాండ సినిమా గురించి అందరికి తెలిసిందే. హీరో సిద్దార్థ్, బాబీ సింహ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, భాషల్లో రీమేక్ అయ్యి ఆయా భాషలలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక లేటెస్ట్ గా సినిమాకు సీక్వెల్ గా జిగర్తాండ డబుల్ ఎక్స్ పేరుతో పార్ట్ 2 రాబోతుంది. కాగా ఈ సినిమాలో రాఘవ లారెన్స్, యస్ జె సూర్య ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా వచ్చే దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో రిలీజ్ అవబోతుంది. దాంతో ఇప్పటి నుంచే సినిమాను తెలుగులో ప్రమోట్ చేయడానికి గాను ఈ సినిమాలోని మొదటి పాటను లాంచ్ చేస్తూ ప్రెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. అయితే ఈ ప్రెస్ మీట్ లో భాగంగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఒక ఆసక్తికర విషయాన్నీ బయటపెట్టాడు.

అయితే ఈ కథను డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రాసుకునే ముందు రాఘవ లారెన్స్ మరియు యస్ జె సూర్యలను అనుకోని రాసుకున్నారట. కానీ కథ ఫైనల్ అయ్యాక యస్ జె సూర్య వేరే సినిమాలతో బిజీ గా ఉండి జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా చేయడానికి డేట్స్ ఇవ్వలేదట. దాంతో యస్ జె సూర్య యస్ జె సూర్య పాత్రకోసం గాను టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ని తీసుకుందామని అనుకున్నారట. కానీ మరొకసారి యస్ జె సూర్య అడిగి చూద్దామని ప్రయత్నించగా ఆయన డేట్స్ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ అయ్యి జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒకవేళ ఈ సినిమా యస్ జె సూర్య కాకుండా నవీన్ పోలిశెట్టి చేసుంటే తెలుగులో ఈ సినిమాకు ఇప్పుడున్న దానికంటే చాలా వరకు ఎక్కువ క్రేజ్ వచ్చి ఉండేదని మాట్లాడుకుంటున్నారు సినీజనం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు