Ravi teja: టైగర్ నాగేశ్వర రావు కథ చెప్పగానే రవితేజ ఏమన్నారంటే ?

రవితేజ లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు ప్రమోషన్స్ జోరందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు నార్త్ ఇండియా అంత తిరిగి టైగర్ నాగేశ్వర రావు సినిమాను విపరీతంగా ప్రమోట్ చేసిన మూవీ టీం ప్రస్తుతం తెలుగులోప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా టైగర్ నాగేశ్వర రావు సినిమాకు పట్టాలెక్కడానికి జరిగిన ప్రాసెస్ లోని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

డైరక్టర్ వంశీ దర్శకత్వంలో రాబోతున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కలర్ ఫోటో డైరక్టర్ సందీప్ రాజ్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ మరియు డైరక్టర్ వంశీ ,టైగర్ నాగేశ్వర రావు సినిమా గురించి ముచ్చటించారు.

ఇక ఇంటర్వ్యూలో సందీప్ రాజ్… టైగర్ నాగేశ్వర రావు కథ చెప్పగానే రవితేజ ఏమన్నారు అని అడగగా.. డైరక్టర్ వంశీ సమాధానం ఇస్తూ…రవితేజ కథ చెప్పమనగానే స్టోరీ 20 నిమిషాలలో చెప్పాలా. గంటలో చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. దాంతో స్టోరీ చెప్పడమే దాదాపు గంటన్నర చెప్పాను. దాంతో రవితేజ ఈరోజుకు ఇది చాలు రేపు సెంకండాఫ్ వింటా అన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ ఇక పిలవరేమో అనుకున్న కానీ ఆయన మళ్ళీ తరువాత సెకండాఫ్ విని, సినిమాలో ఇంకా ఏమేం చేద్దాం అని ఎలిమెంట్స్ చెప్పడం ప్రారంభించాడు. దాంతో ఆయనకు కథ నచ్చిందని అర్థమైంది. అని ఆయన చెప్పారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు