The Dirty Picture: విద్యా బాలన్ ఉండదా ?

బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ అంటే ఇప్పుడు తెలియని వారు ఉండరు. ఈ భామ సినిమా రంగంలోకి 2003లోనే వచ్చినా, గుర్తింపు తెచ్చుకుంది మాత్రం 2011లోనే అని అందరికి తెలుసు. 2011లో వచ్చిన ది డర్టీ పిక్చర్ చిత్రంతో విద్యా బాలన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. రూ. 18 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం, రూ. 117 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమా సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన సంగతి విధితమే. డర్టీ పిక్చర్ రాక ముందు విద్యా బాలన్ చాలా సినిమాలు చేసింది. కానీ ఒక్క సినిమాతో కూడా గుర్తింపు రాలేదు. డర్టీ పిక్చర్ తర్వాత ఈ బాలీవుడ్ బ్యూటీ కెరీర్ మారిపోయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి.

బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో కూడా నటించింది. దీని తర్వాత కూడా బాలీవుడ్, కోలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. విద్యా బాలన్ కు అంతటి క్రేజ్ తెచ్చిన ది డర్టీ పిక్చర్ కు సంబంధించి బాలీవుడ్ లో తాజాగా పలు వార్తలు వినిపిస్తున్నాయి.

సిల్క్ స్మిత బయోపిక్ గా వచ్చిన ఈ డర్టీ పిక్చర్ కు సీక్వెల్ రానున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అయితే ది డర్టీ పిర్చర్ సీక్వెల్ కు మొదటి భాగం దర్శకత్వం వహించిన మిలన్ లుథ్రియానే డైరెక్టర్ గా ఉంటాడా? లేదా కొత్త దర్శకుడు వస్తాడా ? అని తెలియాల్సి ఉంది. అలాగే ఈ సీక్వెల్ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో విద్యా బాలన్ నటిస్తుందా ? లేదా కొత్త కథనాయక వస్తుందా ? అనేది మాత్రం తెలియదు. కానీ త్వరలోనే ఈ సీక్వెల్ పై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం అందుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు