Ramaprabha : తనకంటే చిన్నవాడిని పెళ్లిచేసుకున్న రమప్రభ? శరత్ బాబుతో విభేదాలెందుకు వచ్చాయి?

Ramaprabha : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సినీ ప్రస్థానం కొనసాగిస్తున్న హాస్య నటి రమాప్రభ. తెలుగు లో ఎన్నో సినిమాల్లో హాస్య పాత్రలతో పాటు పలు ఎమోషనల్ స్కోప్ ఉండే పాత్రలు కూడా చేసింది. వయసు రిత్యా ఈ మధ్య సినిమాలు తగ్గించినా అప్పుడప్పుడూ ఇంటర్వ్యూ లలో కనిపిస్తూనే ఉంది. ఇక ఈరోజు (మే 5) ఆమె పుట్టిన రోజు సందర్బంగా మళ్ళీ వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో మంచి పత్రాలు పోషించిన ఆమె ప్రముఖ నటుడు
శరత్ బాబు ను పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. పదేళ్లు కాపురం చేసి పలు కారణాలతో విడిపోయారు. అయితే ఆ మధ్య శరత్ బాబు రమాప్రభ తో అసలు తనది నిజమైన పెళ్లి కాదని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అసలు వీళ్ళ బంధం విడాకులతో ఎందుకు ముగిసింది. ఆరోజుల్లో ఎందుకు విడాకులు తీసుకున్నారన్న చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది.

1974 లో ఒకటైన రమాప్రభ – శరత్ బాబు!

70వ దశకంలో శరత్ బాబు సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో ‘కన్నెవయసు’ హీరో లక్ష్మీకాంత్ ద్వారా రమాప్రభకు పరిచయమైన శరత్ బాబు అప్పటికే చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయిన రమాప్రభ, ఆయన్ను దర్శక నిర్మాతలకు రికమెండ్ చేశారని వార్తలు ఉన్నాయి. శరత్ బాబును హీరోగా ప్రమోట్ చేసేందుకు రమాప్రభ నిర్మాతగా మారి, ‘వింత ఇల్లు సొంత గోల’ అనే సినిమా కూడా నిర్మించారు. అప్పుడే వారిద్దరి బంధంపై పుకార్లు షికారు చేయగా, వాటిని నిజం చేస్తూ 1974లో పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అయితే వయసులో తన కంటే చాలా పెద్దదైన రమాప్రభను శరత్ బాబు ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలంగా మారింది. దాదాపు పదేళ్ళ పాటు వీరిద్దరూ కలిసి జీవించారు. ఇక వీరిద్దరూ కలిసి గాంధీనగర్ రెండవ వీధి, అప్పుల అప్పారావు వంటి చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత పెళ్ళైన పద్నాలుగేళ్లకు వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1990లో తమిళ నటుడు MN నంబియార్ కుమార్తె స్నేహలత నంబియార్ ను వివాహం చేసుకున్నారు శరత్ బాబు. కొన్నేళ్లకు ఆమెతో కూడా విడిపోయారు.

విడిపోవడానికి ప్రధాన కారణం ఇవే!

శరత్ బాబు, రమాప్రభ(Ramaprabha) విడిపోవడానికి ప్రధాన కారణాల్లో వీరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే మనస్పర్థలు వచ్చాయని అంటారు. తనకంటే పెద్దదైన రమాప్రభను సినిమా ఆఫర్స్ కోసమే శరత్ బాబు పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పటికీ రమాప్రభ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబుని తీవ్రంగా విమర్శిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని దూషిస్తూ ఉంటుంది. అయితే ఈ వివాదంలో శరత్ బాబు కూడా తన కోణంలో విశ్లేషణ ఇచ్చారు. రమాప్రభకు అప్పట్లోనే తాను కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఇచ్చానని చెప్పేవారు. కె.బాలచందర్ గారు పరిచయం చేయడం వల్లనే తాను నిలబడ్డానని, తాను ఆమెను కలవకముందే స్టార్‌ డమ్ ఉంది అని చెప్పుకొచ్చాడు శరత్ బాబు. అలాగే చెన్నైలోని అగ్రికల్చర్ ల్యాండ్ ని అమ్మి నేను ఆమెకు ప్రాపర్టీని గిఫ్ట్ గా ఇచ్చారని, దాని వాల్యూ ఇప్పుడు రూ. 60 కోట్ల దాకా ఉంటుందని, తన దృష్టిలో రమా ప్రభతో జరిగింది పెళ్లే కాదని, ఒక కలయిక మాత్రమే అని శరత్ బాబు చెప్పుకొచ్చారు.

- Advertisement -

అయితే ‘రమాప్రభ అంత స్వార్థపరురాలైతే, ఆమెతో అన్నేళ్లు ఎలా కలిసున్నారు?’ అని అడిగితే.. “తాను ఆర్టిస్ట్‌ గా చాలా బిజీగా ఉండేవాడినని, ఆమెతో గొడవ పెట్టుకోవడానికి కూడా తనకు సమయం ఉండేది కాదని శరత్ బాబు ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇలా రమాప్రభ, శరత్ బాబు ఇద్దరూ, ఎవరి వెర్షన్స్ వారు వినిపిస్తూ వచ్చారు. ఇందులో ఎవరిది నిజమనేది పక్కన పెడితే, వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు శరత్ బాబు లేరు కాబట్టి ఈ వార్తలు ఇకపై రాకపోవచ్చు. ఇక రమాప్రభ ఆర్టిస్ట్ గా లాక్ డౌన్ ముందు వరకు బిజీగా ఉండగా, చెన్నై లోనే స్థిర పడడం వల్ల ఇప్పుడు ఆరోగ్య దృష్ట్యా సినిమాలు చేయట్లేదని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు