Manjummel Boys OTT : థియేటర్ లో ఓకే… మరి ఓటీటీ సంగతేంటి..?

Manjummel Boys OTT : ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలతో పోల్చుకుంటే చిన్న సినిమాలు సడన్ గా వచ్చి.. ఎవరు ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అంతేకాదు థియేటర్లలోనే కాదు ఓటీటీ లో కూడా సందడి చేస్తూ భారీ టిఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది మంజుమ్మెల్ బాయ్స్. మలయాళంలో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి దేశవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సినిమా మంజుమ్మెల్ బాయ్స్. ఈ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని సాధించి నిన్న ఓటీటీలోకి వచ్చేసింది.

చిన్న సినిమాగా వచ్చి రూ. 200 కోట్లు కలెక్షన్స్..

నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా చిదంబరం ఎస్ పొడువల్ తెరకెక్కించిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఏ జోనర్ సినిమానైనా ప్రేక్షకులు మెప్పించే విధంగా తెరకెక్కించడంలో మలయాళ మేకర్స్ ఎప్పుడూ సక్సెస్ అవుతారనటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మలయాళ మేకర్స్ రేంజ్ ను కూడా పెంచేసింది. అందుకే ఈ సినిమాను చాలా మంది థియేటర్లలో చూసి ఆదరించారు. అంతేకాదు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేలా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మే 4 అర్థరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసినా కూడా మళ్లీ ఓటీటీ లో సినిమాని చూస్తున్నారు. ముఖ్యంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమాని చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అటు థియేటర్లలో భారీ సక్సెస్ అయిన ఈ సినిమా ఇటు ఓటీటీ లో కూడా అంతకుమించి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు.

ఓటీటీ లో కూడా సత్తా..

ఇకపోతే ఒకవైపు థియేటర్లలో సినిమాని మిస్ అయిన చాలా మంది ఇప్పుడు ఓటీటీలో చూసేస్తున్నారు. అయితే ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్లకి వస్తున్నారు. విడుదలయ్యి రెండు నెలలు అవుతున్నా ఇంకా థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ఏదేమైనా ఈ సినిమా థియేటర్లలో సత్తా చాటి ఇప్పుడు ఓటీటీలో కూడా మరింత దూకుడుగా దూసుకుపోతోంది.

- Advertisement -

మంజుమ్మెల్ బాయ్స్ కథ..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. షౌభిన్ షశీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి  లాల్, దీపక్, ప్రమా బోల్ కీలకపాత్రలో నటించారు. మంజుమ్మెల్ బాయ్స్ గా ఫేమస్ అయిన 11 మంది స్నేహితులు కేరళ నుంచి తమిళనాడుకు ట్రిప్ వెల్దామని అనుకుంటారు. తమిళనాడులోని టూరిస్ట్ స్పాట్ లో ఒకటైన గుణ కేవ్స్ కి వెళ్తారు. అక్కడ ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. దాని నుండి వారు ఎలా బయటపడ్డారు అనేది ఈ చిత్రం. మొత్తానికైతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు