Mass Maharaja: రవితేజ టైగర్ బడ్జెట్ కంట్రోల్ తప్పుతుందా..?

మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. పాన్ ఇండియా వైడ్ విడుదల కానున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. రీసెంట్ గా రావణాసుర సినిమాతో డిజాస్టర్ చవిచూసిన రవితేజకి ఈ సినిమా హిట్ అవ్వడం కీలకంగా మారింది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చయ్యిందని అంటున్నారు. 30కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే 50కోట్ల బడ్జెట్ దాటిపోయిందని అంటున్నారు.

షూటింగ్ దశలో ఉండగానే 5కోట్లు మించిపోయిందంటే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషన్స్ కలుపుకొని సినిమా బడ్జెట్ 70కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్ బడ్జెట్ సినిమా బ్రేకివెన్ సాధించాలంటే కనీసం 80కోట్ల షేర్ సాధించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. రవితేజ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఆ రేంజ్ లో బిజినెస్ జరగలేదు ఇప్పటివరకు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ప్రమోషన్స్ బాగా జరిగి నార్త్ లో మంచి కలెక్షన్స్ రాబడితే కానీ, బ్రేకివెన్ కి ఛాన్స్ ఉండదు.

మరి, రవితేజ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే, నిర్మాత అభిషేక్ అగర్వాల్ గతంలో కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు కాబట్టి  తనకున్న అవగాహనతో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ ఎఫెక్టివ్ గా ప్రమోట్ చేసి రవితేజ కి పాన్ మొదటి పాన్ ఇండియా హిట్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు