Guntur Kaaram: మహా ఘాటుగా ‘గుంటూరు కారం’..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో SSMB 28 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  హారిక, హాసిని బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను 2024 జనవరి 13న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టీజర్ ని థియేటర్లలో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఈ సినిమాకు గుంటూరు కారం అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు. మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా అవుట్ అండ్ మాస్ అవతార్ లో కనిపించిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

టీజర్లో మహేష్ బాబు బీడీ కాల్చే సీన్స్, జీపు ఫ్లయింగ్ షాట్, మిర్చి గాల్లో ఎగిరే షాట్స్ హైలైట్ గా నిలిచాయి. గురూజీ టేకింగ్ కి థమన్ బీజీఎమ్ తోడవటంతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్ తో నిండిపోయింది టీజర్. ఇదివరకు లేని విధంగా డిఫరెంట్ స్లాంగ్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి తమ హీరోని మాస్ అవతార్ లో చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులు ఆశించిన దానికంటే పది రెట్లు ఎలివేట్ చేసి ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేశాడు త్రివిక్రమ్.

గురూజీ, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రూపొందిన ఈ టీజర్ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి. మరి, చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన గురూజీ ఈ సినిమా ద్వారా మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు