SSMB29: ఆ సినిమా తర్వాత జక్కన్న రిటైర్ అవుతాడా..?

దర్శకుడు ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందన్న వార్తలొచ్చిన నేపథ్యంలో స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాకముందే ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. భారీ తారాగణం, అత్యంత భారీ బడ్జెట్ లో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి రచయత విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావిస్తూ RRR సీక్వెల్ గురించి, రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట్లో రిటైర్ అయ్యేలోపు మహాభారతం మీద సినిమా తీస్తానని ప్రకటించిన రాజమౌళి ఇప్పుడు మనసు మార్చుకున్నాడని, మహేష్ బాబు సినిమా తర్వాత మహాభారతం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని చెప్పాడు.

ఈ నేపథ్యంలో రాజమౌళి గతంలో రిటైర్ అయ్యే ముందు మహాభారతం ప్రాజెక్ట్ చేస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ మహాభారతం సినిమా తర్వాత రాజమౌళి రిటైర్ అవబోతున్నాడా అంటూ కొంత మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే, మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వటానికి మినిమమ్ రెండు, మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. పైగా ఆ సినిమా రెండు భాగాలు ఉండనుంది కాబట్టి మహేష్ బాబు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 5సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మహాభారతం సినిమా చేసి రాజమౌళి రిటైర్ అయినా అవ్వచ్చేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు