Ajith : ఆస్పత్రి పాలైన స్టార్ హీరో… టెన్షన్ లో ఫ్యాన్స్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు అని జరుగుతున్న ప్రచారం ఆయన అభిమానులను టెన్షన్ పెడుతోంది. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అజిత్ గురువారం కనిపించడంతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు అజిత్ కు ఏమైందోననే కంగారు మొదలైంది ఫ్యాన్స్ లో. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఇంతకీ అజిత్ కి ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే…

అజిత్ హాస్పిటల్ కు ఎందుకు వెళ్లారంటే?
అజిత్ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లారని సమాచారం. అయితే ఆ చెకప్ లో భాగంగా ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యలు బయట పడ్డాయని, దీంతో డాక్టర్ల సలహా మేరకు చికిత్స కోసం ఈ హీరో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది. మరో రెండు మూడు రోజులపాటు హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత అజిత్ డిస్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని అజిత్ సన్నిహిత వర్గాలు కొట్టి పడేస్తున్నాయి. ఆయన తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కోసం త్వరలోనే విదేశాలకు వెళ్లబోతున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన మెడికల్ ఫార్మాలిటీస్ కోసం హాస్పిటల్ కు వెళ్లాడని చెబుతున్నారు. ఈ ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే అజిత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడని, అజిత్ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనే పుకార్లను అభిమానులు నమ్మవద్దని ఆయన టీం వెల్లడించింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

అజిత్ కొత్త మూవీ..
ప్రస్తుతం అజిత్ “విదా ముయాచి” అనే సినిమాలో నటిస్తున్నారు. గత ఏడాది “తునివు” అనే బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ మూవీతో ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ హీరో ఆ మూవీతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక అజిత్ కెరీర్లో 63వ మూవీగా, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విదా ముయాచి” మూవీకి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రెజీనా, అర్జున్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తుండగా, అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీలో అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా కనిపించబోతోంది.

- Advertisement -

బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్…
కోలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబోల్లో అజిత్, త్రిష జోడి ఒకటి. వీరిద్దరూ కలిసి ఇప్పటిదాకా ఏకంగా ఆరు సినిమాల్లో నటించారు. 2015లో రిలీజ్ అయిన “ఎన్నై అరిందాల్” అనే సినిమా అజిత్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన చివరి సినిమా. ఇక తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి “విదా ముయార్చి” మూవీ కోసం మరోసారి సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేయబోతున్నారు ఈ హీరో హీరోయిన్లు.

100 కోట్ల రెమ్యూనరేషన్…
ప్రస్తుతం స్టార్ హీరోలంతా వందల కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అజిత్ కూడా తన కొత్త చిత్రం “విదా ముయాచి” కోసం ఏకంగా 105 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఒకవేళ ఈ వార్తలే గనక నిజమైతే సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోల లిస్టులో అజిత్ కూడా ఎంటర్ అయినట్టే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు