సలార్.. సాగదీతా..!

బాహుబలి సినిమాల తర్వాత.. ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్.. నెగెటివ్ టాక్ తో నిరాశ పర్చింది. దీంతో ప్రభాస్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. తన తర్వాతి సినిమాలు ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, రాజా డిలక్స్ తో పాటు సలార్ సినిమాలను డార్లింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

అలాగే ఇటీవల రిలీజ్ అయిన యష్-ప్రశాంత్ నీల్ సినిమా కేజీఎఫ్-2 ఎంత పెద్ద హిట్ అందుకుందో అందరికీ తెలుసు. సౌత్ తో పాటు నార్త్ లోనూ కేజీఎఫ్ – 2 ఫీవర్ పట్టుకుంది. హిందీ బెల్ట్ స్టేట్స్ లో ఏకంగా రూ. 400 కోట్లు కొల్లగొట్టి.. దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. మొత్తంగా రూ. 1,100 కోట్ల కలెక్షన్లు చేసింది. దీంతో డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ కు క్రేజీ స్టార్ డమ్ వచ్చింది. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అందరూ ప్రయత్నిస్తున్నారు.

కాగ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని వచ్చే ఏడాది మొదట్లో ఈ మూవీని రిలీజ్ చేస్తామని ప్రశాంత్ నీల్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు.

- Advertisement -

నిజానికి ప్రశాంత్ నీల్ – ప్రభాస్.. సలార్ మూవీపై కేజీఎఫ్-2 కి మించి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను అందుకోవడానికి ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్-2 కి మించిన స్టోరీని సిద్ధం చేయడానికి మరోసారి.. స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. దీంతో ఈ మూవీ రిలీజ్ కు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పుడుకాక పోతే.. మళ్లీ ఎప్పుడు వస్తుందని.. డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు