Trisha : త్రిష దెబ్బకు తలలు పట్టుకుంటున్న నిర్మాతలు..!!

Trisha: త్రిష దెబ్బకు తలలు పట్టుకుంటున్న నిర్మాతలు..!!టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ త్రిష.. పొన్నియన్ సెల్వన్, లియో వంటి చిత్రాలతో మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడం తో పాటూ అంతే స్పీడుతో సరికొత్త సినిమాలకు కమిట్ అవుతోంది త్రిష. ప్రస్తుతం ఈమె వయసు 40 ఏళ్లు.. అయినప్పటికీ కూడా యంగ్ హీరోయిన్లకు పోటీగా మారుతోంది. ప్రస్తుతం త్రిష చేతిలో స్టార్ హీరోల చిత్రాలే ఉన్నవి. ఈ చిత్రాలన్నీ కూడా త్రిషను మళ్లీ అగ్రస్థానంలో మరొకసారి నిలిచేలా చేస్తాయి. లేడీ సూపర్ స్టార్ అయినటువంటి నయనతార కి ఈమె పోటీగా నిలవబోతోందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.

త్రిష రెమ్యునరేషన్..

ఇకపోతే ప్రస్తుతం త్రిష (Trisha) వయసు 40 ఏళ్ల అవుతున్నప్పటికీ ఈమె అందంలో కూడా ఎలాంటి మార్పు లేదని.. ఇదంతా ఒక ఎత్తు అయితే రెమ్యూనరేషన్ విషయంలో అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది త్రిష. ఇప్పటివరకు సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రమే రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పుడు ఈ సంఖ్యని కూడా దాటేసి ఇప్పటివరకు సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఛార్జ్ చేయనంతగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అక్షరాల 12 కోట్ల రూపాయలు ఒక్కో చిత్రానికి త్రిష తీసుకుంటున్నట్లు సమాచారం.

నిర్మాతలకు చుక్కలు..

ఇకపోతే త్రిష ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. మరోవైపు త్రిషకి ఉన్న డిమాండ్ కారణంగానే ఈమె ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా త్రిష తీసుకునే ఈ పారితోషకం చూసి అటు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు..ఇంత పారితోషకం ఇంతవరకు ఏ దక్షిణాది హీరోయిన్ కూడా తీసుకోలేదని తెలుస్తోంది. ఈ రకంగా త్రిషకి ఇది ఒక అరుదైన రికార్డు అయినప్పటికీ.. ఇంతటి రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడంతో చాలామంది దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.. మరి త్రిష చేస్తున్న పని కరెక్టా కాదా అనే విషయం ఆమె సినిమాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ లెక్కన వేసుకుంటే మాలివుడ్లో కూడా త్రిష కు మంచి డిమాండ్ పెరిగిపోతుందని చెప్పవచ్చు. టాలీవుడ్ లో అయితే కేవలం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో మాత్రమే నటిస్తున్నది.

- Advertisement -

త్రిష సినిమాలు..

ప్రస్తుతం అజిత్ సరసన విదా మీమార్చి అనే సినిమాలో నటిస్తున్నది. గతంలో కూడా అజిత్ – త్రిష కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. మలయాళం లో స్టార్ హీరో మోహన్ లాల్ సరసన రామ్ అనే ఒక చిత్రంలో నటిస్తున్నది.. ఇవే కాకుండా ఐడెంటిఫై అనే ఒక మలయాళం సినిమాలో కూడా నటిస్తోంది త్రిష. వీటితోపాటు కమలహాసన్ – మణిరత్నం డైరెక్షన్లో మరొక సినిమా చేస్తోంది. ఇక తెలుగులో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా నటిస్తోంది.ఇలా వరుసగా అగ్ర హీరోల సరసన త్రిష అవకాశాలు అందుకోవడంతో ఇప్పుడు చర్చనీయాంశముగా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు