Prabhas : ఎట్టకేలకు సెట్స్ పైకి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు చేస్తున్నారు. అన్ని కూడా హై బడ్జెట్ సినిమాలే. నాగ అశ్విన్ దర్శకత్వంలో ” ప్రాజెక్టు కె”, కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో “సలార్”, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో “ఆదిపురుష్” వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవే కాకుండా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకునే దర్శకుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రభాస్ కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, ప్రభాస్ కాంబోలో ఒక సినిమా వస్తుందని గతేడాది నుంచే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ కాంబినేషన్ తాజాగా కన్ఫామ్ అయినట్టు సమాచారం.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారని ఫిలింనగర్ లో జోరుగా వినిపిస్తుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ ” ఫైటర్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత ప్రభాస్ తో సిద్ధార్థ్ ఆనంద్ సినిమా చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతుందని ఫిలింనగర్ లో టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు