Ranga Ranga Vaibhavanga : వైభవంగా వైష్ణవ్

ఉప్పెన సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా అరంగేట్రం చేశాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్. మొదటి మూవీ తోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో, వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ” రంగ రంగ వైభవంగా”. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర బృందం. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది మూవీ యూనిట్. ” నువ్వొచ్చి నాతో మాట్లాడేంతవరకు నేను నీతో మాట్లాడను.. గుర్తుపెట్టుకో… నువ్వొచ్చి నాతో మాట్లాడేంతవరకు నేను నీతో మాట్లాడనును గుర్తుపెట్టుకో” అంటూ హీరో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలు చెబుతున్న డైలాగ్స్ తో ట్రైలర్ మొదలైంది. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతున్న హీరో అనుకోని కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా.

ట్రైలర్ చివరలో హీరో “ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్క” అంటూ మెగా వైష్ణవ్ తేజ్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాతో మెగా మేనల్లుడు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు