Tadakha: చైతుకు నాగార్జున వార్నింగ్ ?

నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ ద్విభాషా చిత్రంతోనే నాగచైతన్య తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కృతి శెట్టి హీరోయిన్గా నటించగా… అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలకపాత్రలను పోషించారు.

సోషల్ త్రిల్లర్ కథాంశాలతో గతంలో తమిళంలో పలు సినిమాల్ని తెరకెక్కించాడు దర్శకుడు వెంకట్ ప్రభు. “కస్టడి” కోసం అదే రూట్ ను ఫాలో అయినట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా, అక్కినేని నాగచైతన్య, సునీల్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ‘తడాఖా’. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో చైతన్య హీరో కాగా, తనకు అన్నయ్యగా ఎవరిని తీసుకోవాలని చర్చలో సునీల్ పేరును డైరెక్టర్ డాలి సూచించాడట.

కానీ ‘సునీల్ పక్కన నేను చెయ్యడమేంటి. అతను నాతో సరి సమానమైన హీరోనా? అతన్ని పెడితే నేను సినిమా చేయను’ అని డైరెక్టర్ తో చైతు అన్నారట. దీంతో ఈ విషయం నాగార్జున వరకు వెళ్లగా…’అతనితో చేస్తే నీ విలువ ఎందుకు తగ్గుతుంది. సునీల్ హీరోగా రూ. 30 కోట్లు రాబట్టాడు. నీకు అలాంటి సినిమా ఉందా? ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు’ అని గట్టిగా క్లాస్ పీకాడట. ఆ తర్వాత సునీల్ ను ఇంటికి పిలిచి చైతన్యతో సారీ చెప్పించారట.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు