Telugu actress: హీరోల పరువు తీసిన రకుల్ ? 

రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలియని వారు ఉండరు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ కొద్ది రోజుల్లోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు అందుకుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ రకుల్. తెలుగులో వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అటు ఈ మధ్యకాలంలో రకుల్ కు తెలుగులో మంచి హిట్ లేదు.

ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న “ఇండియన్ టు” చిత్రంలో నటిస్తోంది. ఇదంతా పక్కకు పెడితే.. ఇటీవల ఒక బేటిలో హీరో హీరోయిన్ల మధ్య పారితోషికం విషయంలో తారతమ్యాల గురించి స్పందిస్తూ హీరోల కంటే హీరోయిన్లకు పారితోషకం తక్కువగానే ఉంటుందని పేర్కొంది రకుల్. నిజం చెప్పాలంటే హీరో హీరోయిన్ల ప్రతిభను బట్టి పారితోషికాన్ని నిర్ణయించాలంది. అలాకాకుండా హీరోలకే అధిక పారితోషికం ఇచ్చే పరిస్థితి మారాలని ఆకాంక్షించింది.

సినిమా కోసం హీరో హీరోయిన్ ఒకే మాధిరి శ్రమిస్తారని, అయినా పారితోషికం విషయంలో వ్యత్యాసం చూపిస్తున్నారంది. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే ప్రతిభ హీరోయిన్లకు ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమాలో కథ, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే అది సక్సెస్ అయినట్లేనని అంతే తప్ప అందులో ఎవరు నటించారన్నది ముఖ్యం కాదని అంటుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు