కొర‌టాల‌కు మెగా అవ‌మానం..?

టాలీవుడ్ లో కొర‌టాల శివ ప‌రిచ‌యం అవ‌సరం లేని డైరెక్ట‌ర్. భ‌ద్ర సినిమాతో ర‌చయితగా కెరీర్ ను ప్రారంభించిన కొర‌టాల‌.. దాదాపు 7 సినిమాల‌కు డైలాగ్స్ అందించాడు. 2013 లో తొలి సారి డైరెక్ట‌ర్ అవ‌తారం ఎత్తి.. ప్ర‌భాస్ తో మిర్చి సినిమా తెర‌కెక్కించాడు కొర‌టాల‌. దీని త‌ర్వాత‌.. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను సినిమాలు చేసి వ‌రుస హిట్స్ అందుకున్నాడు. దీంతో మోస్ట్ స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. కొర‌టాల శివ చేసే ప్ర‌తి సినిమాలో ఒక సోష‌ల్ మేసెజ్ ఉంటుంది. అందుకే ఆయ‌న సినిమాలు వ‌రుసగా హిట్స్ అందుకుంటాయి. తాజాగా కొర‌టాల మెగా స్టార్ చిరంజీవితో ఆచార్య చేస్తున్న విష‌యం తెలిసిందే.

టాలీవుడ్ లో డైరెక్ట‌ర్స్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవ‌డం అంత సులువేమీ కాదు. కానీ కొర‌ట‌ల శివ కేవ‌లం నాలుగు సినిమాల‌తోనే… స్టార్ డైరెక్ట‌ర్ ట్యాగ్ ను ద‌క్కించుకున్నాడు. ఆయ‌న చేసిన ప్ర‌తి సినిమాలోనూ హీరోతో స‌మానంగా గుర్తింపు వ‌స్తుంది. అయితే తాజా గా మెగాస్టార్ ఆచార్య సినిమాతో అవ‌మానం ఎదురైంద‌ని స‌మాచారం. కొర‌టాల శివ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడ‌ట‌. దీనికి కారణం.. ఇటీవ‌ల ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎస్ ఎస్ రాజ‌మౌళి కూడా వ‌చ్చారు.

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్.. రాజ‌మౌళి భ‌జ‌న బృందంగా మారింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మెగా స్టార్, మెగా ప‌వ‌ర్ స్టార్.. కొరటాల శివ గురించి ఒక్క మాట మాట్ల‌డ‌కుండా.. అదే ప‌నిగా రాజ‌మౌళినే స్మ‌రించారు. ఇది కొర‌టాల‌కు మింగుడు ప‌డ‌లేద‌ట‌. ఈ స్టార్ డైరెక్ట‌ర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే ఒక్క సార్ట్ డైరెక్ట‌ర్ కు మెగా అవ‌మానం జ‌రిగింద‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కూడా అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు